వైయస్ జగన్ సంక్షేమ పధకాలపై టీడీపీ దుష్ప్రచారం మరో జైత్రయాత్రకు సిద్ధం మేమంతా సిద్ధం బస్సు యాత్ర జైత్ర యాత్రగా సాగింది చంద్రబాబూ....డ్రామాలు కట్టిపెట్టు.... అ‘సామాన్యులు’ వైయస్ఆర్సీపీ అభ్యర్థులుఎంతమంది కలిసొచ్చినా వైయస్ఆర్సీపీ విజయాన్ని ఆపలేరుమాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత వీరశివారెడ్డి వైయస్ఆర్సీపీలో చేరిక కర్నూలు నియోజకవర్గంలో మళ్లీ వైయస్ఆర్సీపీదే విజయం ఓట్ ఫర్ ఫ్యాన్..ఆంధ్రప్రదేశ్ సిద్ధం..అభివృద్ధి, సంక్షేమంలో జగన్ విజన్
రాష్ట్రంలో రాక్షస పాలన
02 Mar 2017 6:22 PM
మడకశిర: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్పై రాష్ట్ర ప్రభుత్వం, పోలీసులు అక్రమ కేసులు బనాయించడం అన్యాయమని పార్టీ సీనియర్ నేత డాక్టర్ తిప్పేస్వామి మండిపడ్డారు. గురువారం స్థానిక తహసీల్దార్ కార్యాలయం ఎదుట డాక్టర్ తిప్పేస్వామి ఆధ్వర్యంలో ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. దివాకర్ ట్రావెల్స్ బస్సు ప్రమాద సంఘటనలో మృతి చెందిన బాధిత కుటుంబాల పక్షాన నిలబడి వైయస్ జగన్ మాట్లాడటం తప్పా అంటూ నిరసన వ్యక్తం చేశారు. తెలుగుదేశం ప్రభుత్వం, పోలీసుల తీరుకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. రాష్ట్రంలో రాక్షస పాలన కొనసాగుతోందని ధ్వజమెత్తారు. డాక్టర్ తిప్పేస్వామి మాట్లాడుతూ విజయవాడ వద్ద దివాకర్ ట్రావెల్స్ బస్సు ప్రమాద సంఘటనలో 11 మంది మృతి చెంది, 30మంది వరకు గాయపడ్డారని తెలిపారు. అయితే ప్రభుత్వం బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోకుండా రక్షించడానికి ప్రయత్నించడం అన్యాయమన్నారు. ప్రతిపక్షనేతపై అక్రమ కేసులు బనాయించి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారన్నారు. వెంటనే ఈ బస్సు ప్రమాద సంఘటనపై బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. వైయస్ జగన్పై బనాయించిన అక్రమ కేసులను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.