బాబు, పవన్లపై ఈసీకి వైయస్ఆర్సీపీ ఫిర్యాదుకూటమి ఛార్జ్షిట్..ఛార్జింగ్ లేని పార్టీల కామెడీ షో అసత్యాలు, అబద్ధాలతో ఎన్డీఏ కూటమి ఛార్జ్షిట్బీసీల గురించి మాట్లాడే అర్హత చంద్రబాబుకు లేదు కూటమి నేతలు విడుదల చేసిన ఛార్జ్షిట్ అబద్దాల పుట్ట రాయలసీమ కోసం పాటు పడే పార్టీ వైయస్ఆర్ కాంగ్రెస్ మీ తండ్రి కోసం పోరాడినందుకు నాకు మీరు ఇచ్చే గౌరవం ఇదా?మంత్రి పదవుల్లో ఉన్నవాళ్లు చాలా జాగ్రత్తగా మాట్లాడాలిచంద్రబాబు నోరు తెరిస్తే అబద్ధాలేఅబద్ధపు హామీలు ఇవ్వటంలో టీడీపీ నేతలు దిట్ట
అవినీతి ముఖ్యమంత్రి వల్లే
08 Dec 2015 11:45 AM
గుంటూరు: చంద్రబాబు, ఆయన తనయుడు లోకే శ్లు మద్యం, మైనింగ్, ఇసుకలను ప్రధాన ఆదాయ వనరులుగా మార్చుకుని కోట్లు గడిస్తున్నారని వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు అన్నారు. రాష్ట్రాన్ని పాలించే ముఖ్యమంత్రే పెద్ద అవినీతిపరుడు కావడంతో ప్రభుత్వ శాఖలన్నీ లంచాల శాఖలుగా మారిపోయాయని ధ్వజమెత్తారు. విజయవాడలోని స్వర్ణ బార్లో జరిగిన కల్తీ మద్యం ఘటనకు ప్రభుత్వమే పూర్తిగా నైతిక బాధ్యత వహించాలన్నారు.
అధికారంలోకి వచ్చిన వెంటనే బెల్ట్ షాపులు రద్దు చేస్తానని మొదటి సంతకం చేసిన చంద్రబాబు...రద్దు చేయకపోగా అంతకు మించి మద్యాన్ని అమ్ముతున్నారని నిప్పులు చెరిగారు. ప్రభుత్వం విచ్చలవిడిగా రాష్ట్రంలో మద్యాన్ని ఏరులై పారిస్తుందని విమర్శించారు. ఎక్సైజ్ మంత్రి కొల్లు రవీంద్ర తన పదవికి రాజీనామా చేయాలని అంబటి డిమాండ్ చేశారు. విజయవాడ ఘటనలో మృతుల కుటుంబాలకు రూ.20 లక్షల చొప్పున ఎక్స్గేషియా ప్రకటించాలన్నారు. బాధితులను కాపాడే బాధ్యత ప్రభుత్వమే తీసుకోవాలన్నారు.