మేమంతా సిద్ధం - 19వ రోజు షెడ్యూల్ బాబు అభివృద్ధి ఎల్లోమీడియాలోనే.. జగన్ అభివృద్ధి ఇంటింటా..!రెండు ఓట్లు ఫ్యాన్ మీద వేస్తే వైయస్ జగన్ మార్క్ పాలన చంద్రబాబుకు బిల్డప్ ఎక్కువ.. పని తక్కువటీడీపీ సోషల్ మీడియాపై ఈసీకి వైయస్ఆర్ సీపీ ఫిర్యాదుజన్మదిన శుభాకాంక్షలు అమ్మమంగళగిరిలో హత్యారాజకీయాలు లోకేష్ చలవే ‘తూర్పు’ కొండల్లో ఉదయించిన సూర్యుడిలాగుంటూరు వెస్ట్లో టీడీపీకి భారీ షాక్..వైయస్ఆర్సీపీలోకి కీలక నేతలునామినేషన్లు దాఖలు చేసిన వైయస్ఆర్ సీపీ అభ్యర్థులు
మహానేతపై విమర్శలు తగదు
19 Jul 2013 12:56 PM
తిరుపతి 19 జూలై 2013:
రాష్ట్రాన్ని మద్యాంధ్రప్రదేశ్గా మార్చిన ఘనత పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణకే దక్కుతుందని మాజీ ఎమ్మెల్సీ, వైయస్ఆర్ కాంగ్రెస్ నాయకుడు రెహ్మాన్ పేర్కొన్నారు. శుక్రవారం తిరుపతిలో ఆయన మీడియాతో మాట్లాడారు. మద్యం సిండికేట్లకు నాయకత్వం వహిస్తున్న ఆయన దివంగత మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డిని విమర్శించడం తగదన్నారు. బొత్స ఎక్కడ పర్యటించినా తమ పార్టీ కార్యకర్తలు అడ్డుకుంటారని రెహ్మాన్ తెలిపారు. ముస్లింల సంక్షేమానికి గతంలో డాక్టర్ వైయస్ఆర్ ఎన్నో చర్యలు చేపట్టారని గుర్తుచేశారు. నేడు అలాంటి నాయకులు కరవయ్యారన్నారు. పంచాయతీ ఎన్నికల్లో వైయస్ఆర్ కాంగ్రెస్ మద్దతుదారులను గెలిపించుకోవాలని రెహ్మాన్ పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు.