భ‌రోసా యాత్ర‌తో దిగి వ‌చ్చిన ప్ర‌భుత్వం

భ‌రోసా యాత్ర‌తో దిగి వ‌చ్చిన ప్ర‌భుత్వం

అనంత‌పురం ) ప్ర‌తిప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి చేప‌ట్టిన రైతు భ‌రోసా యాత్ర‌తో ప్ర‌భుత్వం దిగి వ‌చ్చింది. ఈ రాష్ట్రంలో రైతు ఆత్మ‌హ‌త్య‌లే లేవంటూ బుకాయిస్తూ వ‌చ్చిన చంద్ర‌బాబు స‌ర్కార్ ...చివ‌ర‌కు వాస్త‌వాల్ని అంగీక‌రించింది, అనంత‌పురం జిల్లాలో ఆత్మ‌హ‌త్య‌లు చేసుకొన్న రైతు కుటుంబాల‌కు మ‌ధ్యంత‌ర ప‌రిహారం కింద రూ. 49 ల‌క్ష‌ల 50వేలు విడుద‌ల చేసింది. చంద్ర‌బాబు ప్ర‌భుత్వం చేసిన రుణ‌మాఫీ మోసంతో వ్య‌వ‌సాయ దారుల జీవితాలు ఛిన్నాభిన్నం అయ్యాయి. వ్య‌వ‌సాయం చేసే దారి లేక అప్పుల నుంచి బ‌య‌ట ప‌డ‌లేక ఇబ్బందుల్లో కూరుకొని పోయారు. అటువంటి రైతు కుటుంబాల్ని ఓదార్చి, వారిలో ధైర్యాన్ని నింపేందుకు వైఎస్ జ‌గ‌న్ ఈ యాత్ర చేప‌ట్టారు.

Back to Top