వైయస్ జగన్ సంక్షేమ పధకాలపై టీడీపీ దుష్ప్రచారం మరో జైత్రయాత్రకు సిద్ధం మేమంతా సిద్ధం బస్సు యాత్ర జైత్ర యాత్రగా సాగింది చంద్రబాబూ....డ్రామాలు కట్టిపెట్టు.... అ‘సామాన్యులు’ వైయస్ఆర్సీపీ అభ్యర్థులుఎంతమంది కలిసొచ్చినా వైయస్ఆర్సీపీ విజయాన్ని ఆపలేరుమాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత వీరశివారెడ్డి వైయస్ఆర్సీపీలో చేరిక కర్నూలు నియోజకవర్గంలో మళ్లీ వైయస్ఆర్సీపీదే విజయం ఓట్ ఫర్ ఫ్యాన్..ఆంధ్రప్రదేశ్ సిద్ధం..అభివృద్ధి, సంక్షేమంలో జగన్ విజన్
భరోసా యాత్రతో దిగి వచ్చిన ప్రభుత్వం
29 Jul 2015 8:13 PM
భరోసా యాత్రతో దిగి వచ్చిన ప్రభుత్వం
అనంతపురం ) ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన రైతు భరోసా యాత్రతో ప్రభుత్వం దిగి వచ్చింది. ఈ రాష్ట్రంలో రైతు ఆత్మహత్యలే లేవంటూ బుకాయిస్తూ వచ్చిన చంద్రబాబు సర్కార్ ...చివరకు వాస్తవాల్ని అంగీకరించింది, అనంతపురం జిల్లాలో ఆత్మహత్యలు చేసుకొన్న రైతు కుటుంబాలకు మధ్యంతర పరిహారం కింద రూ. 49 లక్షల 50వేలు విడుదల చేసింది. చంద్రబాబు ప్రభుత్వం చేసిన రుణమాఫీ మోసంతో వ్యవసాయ దారుల జీవితాలు ఛిన్నాభిన్నం అయ్యాయి. వ్యవసాయం చేసే దారి లేక అప్పుల నుంచి బయట పడలేక ఇబ్బందుల్లో కూరుకొని పోయారు. అటువంటి రైతు కుటుంబాల్ని ఓదార్చి, వారిలో ధైర్యాన్ని నింపేందుకు వైఎస్ జగన్ ఈ యాత్ర చేపట్టారు.