బాబు, పవన్లపై ఈసీకి వైయస్ఆర్సీపీ ఫిర్యాదుకూటమి ఛార్జ్షిట్..ఛార్జింగ్ లేని పార్టీల కామెడీ షో అసత్యాలు, అబద్ధాలతో ఎన్డీఏ కూటమి ఛార్జ్షిట్బీసీల గురించి మాట్లాడే అర్హత చంద్రబాబుకు లేదు కూటమి నేతలు విడుదల చేసిన ఛార్జ్షిట్ అబద్దాల పుట్ట రాయలసీమ కోసం పాటు పడే పార్టీ వైయస్ఆర్ కాంగ్రెస్ మీ తండ్రి కోసం పోరాడినందుకు నాకు మీరు ఇచ్చే గౌరవం ఇదా?మంత్రి పదవుల్లో ఉన్నవాళ్లు చాలా జాగ్రత్తగా మాట్లాడాలిచంద్రబాబు నోరు తెరిస్తే అబద్ధాలేఅబద్ధపు హామీలు ఇవ్వటంలో టీడీపీ నేతలు దిట్ట
అలుపెరగని పాదయాత్ర
13 Jan 2018 11:26 AM
- అనారోగ్యాన్ని లెక్క చేయని వైయస్ జగన్
- సంకల్ప బలంతో ముందుకు సాగుతున్న జననేత
చిత్తూరు: ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు, ప్రజలకు భరోసా కల్పించేందుకు వైయస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర నిర్వీరామంగా సాగుతోంది. గతేడాది నవంబర్ 6న వైయస్ఆర్ జిల్లా ఇడుపులపాయలో ప్రారంభమైన జననేత పాదయాత్ర ఇవాళ 61వ రోజుకు చేరింది. ప్రస్తుతం చిత్తూరు జిల్లాలో ప్రజాసంకల్ప యాత్ర కొనసాగుతోంది. అయితే వైయస్ జగన్మోహన్రెడ్డి విపరీతమైన జలుబు, డస్ట్ అలర్జీతో ఇబ్బంది పడుతున్నారు. దీనికితోడు గొంతు నొప్పి, కళ్ల నుంచి నీరు కారడం వంటివి ఆయనను మరింత ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. రోజూ ఉదయం నుంచీ సాయంత్రం వరకూ పల్లెపల్లెనా పాదయాత్ర చేసే క్రమంలో పెద్ద ఎత్తున ప్రజలు, అభిమానుల ఆయన వెంట అడుగులో అడుగేసి నడుస్తున్నారు. దట్టంగా లేస్తున్న ధూళి రేణువులు జగన్ను చుట్టేసి డస్ట్ అలర్జీకి కారణమవుతున్నాయి.అయినప్పటికీ పాదయాత్రలో ఎదురొచ్చే అభిమానులు, ప్రజలతో ఆప్యాయంగా మాట్లాడుతూ విరామం లేకుండా నగక సాగిస్తూనే ఉన్నారు. రోజూ రాత్రి పూట పనులన్నీ పూర్తి చేసుకుని, తనను కలిసేందుకు వచ్చిన వారందరితో వైయస్ జగన్ మాట్లాడుతున్నారు.
విశ్రాంతి కరువు
ప్రజా సంకల్ప యాత్రలో ఉన్న వైయస్ జగన్కు విశ్రాంతి కరువైంది. ఆలస్యంగా నిద్రపోవడం, మరుసటి రోజు ఉదయాన్నే నిద్రలేచి సరిగ్గా 8.30 గంటలకు మళ్లీ పాదయాత్ర ప్రారంభిస్తుండడంతో నిద్ర తక్కువవుతోంది. మధ్యాహ్నం భోజన విరామ సమయంలోనూ ఎవరో ఒకరు కలిసేందుకు వస్తున్నారు. దీంతో శరీరానికి పూర్తిగా విశ్రాంతి కరువైంది. అప్పుడప్పుడూ భోజన విరామానికి సైతం ఆగకుండా నడక సాగిస్తున్నారు. మూడు రోజులుగా జలుబు, గొంతునొప్పి ఎక్కువయ్యాయి. రోడ్ల వెంట లేస్తున్న దుమ్మూ ధూళి నోటిలోకి పోతుండడంతో గొంతునొప్పి వస్తోందని వైద్యులు చెబుతున్నారు. జలుబు, దగ్గు కారణంగా జగన్ నలతగా ఉంటున్నారు. గురు, శుక్రవారాల్లో విపరీతమైన ఎండ కారణంగా గొంతు త్వరగా తడారిపోయి నీరసంగా కనిపించారు. శుక్రవారం పాదయాత్ర మొదలైంది మొదలు గంటకోసారి ఆయన జలుబు, తుమ్ములతో సతమతమయ్యారు. ఇడుపులపాయలో పాదయాత్ర మొదలైనప్పటి నుంచి ఇప్పటివరకూ వైయస్ జగన్ అరున్నర కిలోల బరువు తగ్గినట్లు వైద్యులు చెబుతున్నారు. కనీసం రెండు రోజులైనా విశ్రాంతి అవసరమని వైద్యులు, పార్టీ నేతలు కోరుతున్నా జగన్ వినడం లేదు. షెడ్యూల్ ప్రకారం పాదయాత్ర కొనసాగిస్తున్నారు.