మేమంతా సిద్ధం - 19వ రోజు షెడ్యూల్ బాబు అభివృద్ధి ఎల్లోమీడియాలోనే.. జగన్ అభివృద్ధి ఇంటింటా..!రెండు ఓట్లు ఫ్యాన్ మీద వేస్తే వైయస్ జగన్ మార్క్ పాలన చంద్రబాబుకు బిల్డప్ ఎక్కువ.. పని తక్కువటీడీపీ సోషల్ మీడియాపై ఈసీకి వైయస్ఆర్ సీపీ ఫిర్యాదుజన్మదిన శుభాకాంక్షలు అమ్మమంగళగిరిలో హత్యారాజకీయాలు లోకేష్ చలవే ‘తూర్పు’ కొండల్లో ఉదయించిన సూర్యుడిలాగుంటూరు వెస్ట్లో టీడీపీకి భారీ షాక్..వైయస్ఆర్సీపీలోకి కీలక నేతలునామినేషన్లు దాఖలు చేసిన వైయస్ఆర్ సీపీ అభ్యర్థులు
చంద్రబాబు పదవి నుంచి దిగిపో
02 Jun 2016 12:54 PM
పశ్చిమగోదావరి(ఆకివీడు): ‘అవినీతి, అసమర్థ, అక్రమ పాలన సాగిస్తున్న చంద్రబాబు పదవి నుంచి దిగిపోవాలని గాంధేయవాది, స్వాతంత్య్ర సమరయోథులు, సర్వోదయ సంఘ ప్రధాన కార్యదర్శి పత్తి శేషయ్య డిమాండ్ చేశారు. పశ్చిమగోదావరి జిల్లా ఆకివీడు వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడుతూ... అప్రజాస్వామిక విధానాలను ప్రోత్సహిస్తూ బాబు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని ఆరోపించారు.
ఎమ్మెల్యేల కొనుగోళ్లు, రాజ్యసభ సభ్యుల ఎంపిక వంటి వాటితో పాటు డబ్బుతో రాజకీయాన్ని ముడిపెట్టడం తగదన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రభుత్వంతో పాటు బలమైన ప్రతిపక్షం ఉండాలన్నారు. అయితే ప్రతిపక్షం లేకుండా చేసి ప్రజలు మనవైపే ఉండాలని బాబు ఆలోచన చేయడం అవివేకమన్నారు. ప్రతిపక్షనేత వైయస్ జగన్మోహన్రెడ్డి చేస్తోన్న ఉద్యమాలకు ప్రభుత్వం స్పందించకపోవడం దారుణమన్నారు.