బాబు, పవన్లపై ఈసీకి వైయస్ఆర్సీపీ ఫిర్యాదుకూటమి ఛార్జ్షిట్..ఛార్జింగ్ లేని పార్టీల కామెడీ షో అసత్యాలు, అబద్ధాలతో ఎన్డీఏ కూటమి ఛార్జ్షిట్బీసీల గురించి మాట్లాడే అర్హత చంద్రబాబుకు లేదు కూటమి నేతలు విడుదల చేసిన ఛార్జ్షిట్ అబద్దాల పుట్ట రాయలసీమ కోసం పాటు పడే పార్టీ వైయస్ఆర్ కాంగ్రెస్ మీ తండ్రి కోసం పోరాడినందుకు నాకు మీరు ఇచ్చే గౌరవం ఇదా?మంత్రి పదవుల్లో ఉన్నవాళ్లు చాలా జాగ్రత్తగా మాట్లాడాలిచంద్రబాబు నోరు తెరిస్తే అబద్ధాలేఅబద్ధపు హామీలు ఇవ్వటంలో టీడీపీ నేతలు దిట్ట
'మహిళలకు చంద్రబాబు క్షమాపణలు చెప్పాలి'
27 Aug 2015 2:55 PM
ఏలూరు: ప్రత్యేక హోదా విషయంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అనుసరిస్తున్న వైఖరిపై వైఎస్ఆర్ సీపీ నేతలు కొత్తపల్లి సుబ్బారాయుడు, ఘంటా మురళీ మండిపడ్డారు. బుధవారం పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో కొత్తపల్లి సుబ్బారాయుడు, ఘంటా మురళీ మాట్లాడుతూ... 15 నెలలు పాలనలో ప్రత్యేక హోదా ఎందుకు గుర్తుకు రాలేదంటూ చంద్రబాబును వారు ప్రశ్నించారు. తమ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన మోహన్ రెడ్డి ప్రత్యేక హోదా కోసం న్యూఢిల్లీలో ధర్నా చేపట్టారని... ఆ తర్వాత కూడా చంద్రబాబు మేల్కొలేదన్నారు.
ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా వచ్చే వరకు వైఎస్ఆర్ సీపీ పోరాటం ఆగదని వారు స్పష్టం చేశారు. సీఎం హోదాలో చంద్రబాబు లింగ వివక్ష వ్యాఖ్యలు చేయడం దురదృష్టకరమన్నారు. మహిళలకు చంద్రబాబు క్షమాపణలు చెప్పాలని కొత్తపల్లి సుబ్బారాయుడు, ఘంటా మురళీ డిమాండ్ చేశారు.