<strong>బాబు రాష్ట్రంలో మద్యాన్ని ఏరులై పారిస్తున్నారు</strong><strong>ప్రజలను దోచుకోవడమే బాబు విజన్ 20</strong><strong>మద్యం ఉత్పత్తిలో ఏపీని నంబర్ 1 చేయాలని చూస్తున్నాడు</strong><strong>ఎన్టీఆర్ సుజల స్రవంతి అన్నాడు.. చుక్కనీరివ్వడం లేదు</strong><strong>కానీ నారావారి సారా స్రవంతి మాత్రం దిగ్విజయంగా కొనసాగుతోంది</strong><strong>వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు</strong><br/><strong>హైదరాబాద్ః</strong> మద్యం ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్ను దేశంలోనే నంబర్ 1 చేయడానికి బాబు ప్రయత్నం చేస్తున్నారని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు మండిపడ్డారు. ప్రతీ ఇంటికి రూ. 2 తో 20 లీటర్ల మంచినీళ్లను ఎన్టీయార్ సుజలస్రవంతి ద్వారా అందిస్తామని చెప్పిన బాబు.... రెండు చుక్కల నీరు కూడా అందించడం లేదని అంబటి ఫైరయ్యారు. ఆపథకం ఎక్కడపోయిది ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు. . హైదరాబాద్ లో పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో అంబటి రాంబాబు మాట్లాడుతూ ఏమన్నారంటే....<br/>ఆంధ్రప్రదేశ్గా ఉన్న రాష్ట్రాన్ని చంద్రబాబు అవినీతి రాష్ట్రంగా మార్చారు.ఎన్టీఆర్ సుజలస్రవంతి సంగతి దేవుడెరుగు ... నారా వారి సారా సవ్రంతి మాత్రం దిగ్విజయంగా కొనసాగుతోంది.మద్యం తాగాలనుకునే వారికి ఎక్కడా లోటు రాకుండా టీడీపీ పుష్కలంగా మద్యం అందించే కార్యక్రమం చేస్తుంది.8.78 కోట్ల ఫ్రూఫ్ లీటర్ల మద్యాన్ని ప్రైవేట్ రంగంలో ఉత్పత్తి చేయాలని బాబు ఒక జీవోను విడుదల చేశారు.మళ్లీ కొత్తగా 1,489 లక్షల ఫ్రూఫ్ లీటర్ల మద్యం ఉత్పత్తికి అనుమతులను మంజూరు చేస్తూ మరో జీవోను విడుదల చేశారు.మద్యం వినియోగం తగ్గిస్తాం... ప్రతి ఊర్లో డీ ఎడిక్షన్ సెంటర్లు పెడతాం... దశల వారీగా మద్యాన్ని నిషేదిస్తామన్న బాబు హామీ ఏమైంది.హైవే పక్కన మద్యం దుకాణాలు ఉంటే డ్రైవర్లు మద్యం సేవించి ప్రమాదాల బారిన పడే అవకాశం ఉందని, అక్కడ దుకాణాలు ఉండొద్దని గత ప్రభుత్వాలు జీవోలను విడుదల చేశాయి. చంద్రబాబు వచ్చిన తర్వాత హైవేలు అయిన పర్వాలేదు... మద్యం దుకణాలను ప్రారంభించండి అని అధికారులకు చెప్పడమే కాకుండా టేట్రాప్యాక్లను తీసుకురావడం సిగ్గు చేటు. ప్రజలను మద్యానికి బానిస చేసేటువంటి కార్యక్రమాలను త్వరితగతిన అమలు చేయడంతో చంద్రబాబు నంబర్ వన్ స్థానంలో ఉన్నాడు. మద్యం వల్లే కుటుంబాలు చిన్నభిన్నం అవుతున్నాయని... తాను అధికారంలోకి రాగానే బెల్టు షాపులను పూర్తిస్థాయిలో రద్దు చేస్తానని చంద్రబాబు తన పాదయాత్రలోప్రగాల్భాలు పలికారు.బాబు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏపీలో ఏ ఒక్క చోటైనా మద్యం దుకాణాలను రద్దు చేశారా .రద్దు చేయకపోగా నూతన మద్యం దుకాణాలకు లైసెన్సులు జారీ చేస్తూ ఏపీలో మద్యాన్నిఏరులై పారిస్తున్నారు. కేవలం కమిషన్ల కోసమే పట్టిసీమ, మద్యం ఉత్పత్తి కార్యక్రమాలు ఎన్టీఆర్ సుజల స్రవంతిని ముంచేశారు.... కమిషన్లు ఇస్తే తప్ప ఎన్టీఆర్ సుజల స్రవంతి ప్రారంభం కాదన్న భావన ప్రజల్లో ఉందిరెక్కాడితే గానీ డొక్కాడని వారిని దోచుకునేందుకే బాబు విజన్-20.మద్యాన్ని విపరీతంగా తాగించడం, కల్తీ మద్యం విక్రయాలు చేయించడమే విజన్-20 అని ఆరోపించారు.రాష్ట్రంలో ఇలాగే మద్యాన్ని కొనసాగిస్తే ప్రజలు చంద్రబాబుకు బదులు మందు బాబు అని పిలుస్తారు. మంత్రి నారాయణ కోసం ప్రభుత్వ విద్యాలయాలు మూయించేశారు. చైనా వారి కోసం దేవాలయాలు కూల్చారు.కమిషన్ల కోసం మద్యాన్ని పెంచి పోషించి కాపురాలను కూల్చొద్దని బాబును డిమాండ్ చేస్తున్నాం. గడపగడపకూ వైయస్సార్ కార్యక్రమానికి ప్రజల స్పందన మహోద్యమంగా ఉంది.