బాబు, పవన్లపై ఈసీకి వైయస్ఆర్సీపీ ఫిర్యాదుకూటమి ఛార్జ్షిట్..ఛార్జింగ్ లేని పార్టీల కామెడీ షో అసత్యాలు, అబద్ధాలతో ఎన్డీఏ కూటమి ఛార్జ్షిట్బీసీల గురించి మాట్లాడే అర్హత చంద్రబాబుకు లేదు కూటమి నేతలు విడుదల చేసిన ఛార్జ్షిట్ అబద్దాల పుట్ట రాయలసీమ కోసం పాటు పడే పార్టీ వైయస్ఆర్ కాంగ్రెస్ మీ తండ్రి కోసం పోరాడినందుకు నాకు మీరు ఇచ్చే గౌరవం ఇదా?మంత్రి పదవుల్లో ఉన్నవాళ్లు చాలా జాగ్రత్తగా మాట్లాడాలిచంద్రబాబు నోరు తెరిస్తే అబద్ధాలేఅబద్ధపు హామీలు ఇవ్వటంలో టీడీపీ నేతలు దిట్ట
చంద్రబాబు విచ్చలవిడి అవినీతి
03 Oct 2016 1:38 PM
హైదరాబాద్ః బాబు అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లయినా రాజధానిలో ఒక్క నిర్మాణం కూడా చేపట్టకపోవడం దారుణమని వైయస్సార్సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు మండిపడ్డారు. అంతా తాత్కాలికం అంటూ ప్రభుత్వం చేస్తున్న తంతంగం చూస్తోంటే బాధేస్తుందన్నారు. రాష్ట్రాన్ని దోచుకునేందుకే బాబు హైదరాబాద్ నుంచి హడావిడిగా విజయవాడకు తరలిపోయారని ఎద్దేవా చేశారు. బాబు, లోకేష్, మంత్రులు విచ్చలవిడిగా అవినీతికి పాల్పడుతున్నారని నిప్పులు చెరిగారు. బాబు అక్రమాలను, అన్యాయాలను నిలదీస్తున్న ప్రతిపక్షాలు, ప్రజాసంఘాలపై పోలీసులను ఉసిగొల్పి అణచివేయాలని చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బాబుకు ప్రజలే తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు.