బాబు, పవన్లపై ఈసీకి వైయస్ఆర్సీపీ ఫిర్యాదుకూటమి ఛార్జ్షిట్..ఛార్జింగ్ లేని పార్టీల కామెడీ షో అసత్యాలు, అబద్ధాలతో ఎన్డీఏ కూటమి ఛార్జ్షిట్బీసీల గురించి మాట్లాడే అర్హత చంద్రబాబుకు లేదు కూటమి నేతలు విడుదల చేసిన ఛార్జ్షిట్ అబద్దాల పుట్ట రాయలసీమ కోసం పాటు పడే పార్టీ వైయస్ఆర్ కాంగ్రెస్ మీ తండ్రి కోసం పోరాడినందుకు నాకు మీరు ఇచ్చే గౌరవం ఇదా?మంత్రి పదవుల్లో ఉన్నవాళ్లు చాలా జాగ్రత్తగా మాట్లాడాలిచంద్రబాబు నోరు తెరిస్తే అబద్ధాలేఅబద్ధపు హామీలు ఇవ్వటంలో టీడీపీ నేతలు దిట్ట
ప్లీనరీని విజయవంతం చేయాలని పిలుపు
26 Jun 2017 6:54 PM
టెక్కలి: ప్రభుత్వ వైఫల్యాలు, అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటం చేసేందుకు ఈ నెల 28న జిల్లా కేంద్రంలో నిర్వహించనున్న వైయస్సార్సీపీ ప్లీనరీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త పేరాడ తిలక్ పిలుపునిచ్చారు. స్థానిక పార్టీ కార్యాలయంలో సోమవారం జిల్లా ప్లీనరీకి సంబంధించిన పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా తిలక్ మాట్లాడుతూ అధికార పార్టీ కార్యకర్తలకు మాత్రమే సంక్షేమ పథకాలను అందజేసి సామాన్యులపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని అన్నారు. ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై ప్రజలు పూర్తిగా విసుగు చెందారని, రానున్న ఎన్నికల్లో టీడీపీకి బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని అన్నారు. జిల్లా కేంద్రంలో నిర్వహించనున్న పార్టీ ప్లీనరీ సమావేశానికి నియోజకవర్గంలోని పార్టీ నాయకులు, కార్యకర్తలు అభిమానులు పెద్ద ఎత్తున హాజరు కావాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు టి.జానకిరామయ్య, ఎన్.శ్రీరామ్మూర్తి, కె.నారాయణమూర్తి, సత్తారు సత్యం, టి.కిరణ్ ఉన్నారు.