<strong>విజయనగరం : </strong>ప్రచారం దొరుకుతుందంటే చంద్రబాబు దేనికైనా సిద్ధమేనంటూ రాజ్యసభ సభ్యులు విజయసాయి రెడ్డి ట్విట్టర్లో ధ్వజమెత్తారు. 20 లక్షల జనాభాకు మంచి నీరందించే ప్రకాశం బ్యారేజీలో శాశ్వత జలక్రీడల కేంద్రాలను ఏర్పాటు చేస్తారట అంటూ ట్విట్ చేశారు. ప్రపంచంలో ఎక్కడైనా డ్రింకింగ్ వాటర్ సోర్స్ను జాగ్రత్తగా కాపాడుకుంటారు. బాబులాగా అపరిశుభ్రం చేయరని ట్విట్టర్లో పేర్కొన్నారు.<br/>