బాబు, పవన్లపై ఈసీకి వైయస్ఆర్సీపీ ఫిర్యాదుకూటమి ఛార్జ్షిట్..ఛార్జింగ్ లేని పార్టీల కామెడీ షో అసత్యాలు, అబద్ధాలతో ఎన్డీఏ కూటమి ఛార్జ్షిట్బీసీల గురించి మాట్లాడే అర్హత చంద్రబాబుకు లేదు కూటమి నేతలు విడుదల చేసిన ఛార్జ్షిట్ అబద్దాల పుట్ట రాయలసీమ కోసం పాటు పడే పార్టీ వైయస్ఆర్ కాంగ్రెస్ మీ తండ్రి కోసం పోరాడినందుకు నాకు మీరు ఇచ్చే గౌరవం ఇదా?మంత్రి పదవుల్లో ఉన్నవాళ్లు చాలా జాగ్రత్తగా మాట్లాడాలిచంద్రబాబు నోరు తెరిస్తే అబద్ధాలేఅబద్ధపు హామీలు ఇవ్వటంలో టీడీపీ నేతలు దిట్ట
ఆక్వా ఘటనను తప్పుదోవ పట్టించే యత్నం
01 Apr 2017 10:49 AM
ఏలూరు/నరసాపురం: మొగల్తూరులోని ఆనంద ఆక్వాప్లాంట్లోని ట్యాంకు నుంచి విషవాయువులు వెలువడి ఐదుగురు యువకులు మృత్యువాత పడిన కేసును ఆనంద గ్రూపు సంస్థల యాజమాన్యం తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు ప్రారంభించింది. ఈ ఘటన విషవాయువు వల్ల జరగలేదని, విద్యుదాఘాతం వల్ల మరణాలు సంభవించాయని చెప్పేందుకు రంగం సిద్ధం చేసింది. ఇందుకోసం కంపెనీ ఉద్యోగి ఒకరిని గురువారం రాత్రి ఒక ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించింది.
అతనితో ఇది షార్ట్ సర్క్యూట్ వల్ల జరిగిన ప్రమాదంగా చెప్పించే ప్రయత్నం చేపట్టింది. ఫ్యాక్టరీకి సమీపంలోనే నివసించే నల్లం సత్యనారాయణ ఘటన జరిగిన సమయంలో ప్లాంటులో ఉన్నాడు. కానీ అతను ప్రమాదం జరిగిన ట్యాంకు వద్దకు చేరుకోలేదు. అయితే యాజమాన్యం గురువారం రాత్రి అతన్ని నరసాపురంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించి, అస్వస్థతకు గురైనట్టు పేర్కొంది. శుక్రవారం అతనితో విలేకరుల సమావేశం పెట్టి.. ఇది కరెంట్ షాక్ వల్లే జరిగిందని, తాను ఆ సమయంలో వైర్లు కట్ చేసే ప్రయత్నం కూడా చేశానని చెప్పించింది.