బాబుకు బుద్ధి వచ్చేలా ధర్నాకు కదలిరండి

అనంతపురం : ఈ ప్రభుత్వానికి కరువు రైతుల సమస్యలే పట్టడం లేదని వైయస్సార్సీపీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి, మాజీ ఎంపీ అనంతవెంకట్రామిరెడ్డి మండిపడ్డారు. చంద్రబాబుకు బుద్ధి వచ్చేలా వైయస్ జగన్ ఈనెల 27న కలెక్టరేట్ వద్ద చేపట్టనున్న ధర్నాకు మద్దతు ఇవ్వాలని రైతులకు  పిలుపునిచ్చారు. అనంతపురంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ...తుంగభద్ర ఎగువకాల్వ ఆయుకట్టుకు ప్రతి ఏటా అన్యాయం జరుగుతుందని వారు ఆవేదన వ్యక్తం చేశారు.  ఇన్పుట్ సబ్సిడీ, బీమా డబ్బులు ఎగ్గొట్టేందుకు చంద్రబాబు రెయిన్గన్ల డ్రామా అడుతున్నారని విమర్శించారు.

Back to Top