ఆర్డీఎస్ ఎత్తు పెంపుకు నిరసనగా ఆందోళన

కర్నూలు: ఆర్డీఎస్ ఎత్తు పెంపును నిరసిస్తూ కర్నూలు జిల్లా కోసిగి మండలం అగసలూరు వద్ద వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆందోళన చేపట్టింది.  స్థానిక ఎమ్మెల్యే వై.బాలనాగిరెడ్డి ఆధ్వర్యంలో ఈ ఉదయం 200 మంది రైతులు ధర్నాకు తరలివచ్చారు. పనులను అడ్డుకునేందుకు యత్నించగా పోలీసులు  పెద్ద సంఖ్యలో అక్కడకు చేరుకొని వారిని నిలువరించారు. పోలీసులు, రైతుల మధ్య తోపులాటతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.

Back to Top