బాబు, పవన్లపై ఈసీకి వైయస్ఆర్సీపీ ఫిర్యాదుకూటమి ఛార్జ్షిట్..ఛార్జింగ్ లేని పార్టీల కామెడీ షో అసత్యాలు, అబద్ధాలతో ఎన్డీఏ కూటమి ఛార్జ్షిట్బీసీల గురించి మాట్లాడే అర్హత చంద్రబాబుకు లేదు కూటమి నేతలు విడుదల చేసిన ఛార్జ్షిట్ అబద్దాల పుట్ట రాయలసీమ కోసం పాటు పడే పార్టీ వైయస్ఆర్ కాంగ్రెస్ మీ తండ్రి కోసం పోరాడినందుకు నాకు మీరు ఇచ్చే గౌరవం ఇదా?మంత్రి పదవుల్లో ఉన్నవాళ్లు చాలా జాగ్రత్తగా మాట్లాడాలిచంద్రబాబు నోరు తెరిస్తే అబద్ధాలేఅబద్ధపు హామీలు ఇవ్వటంలో టీడీపీ నేతలు దిట్ట
నోరు తెరిస్తే అబద్ధాలే
21 Mar 2017 12:38 PM
- టీడీపీ నేతలు రికార్డులు చూసి మాట్లాడడం నేర్చుకోవాలి
- నోరుంది కదా అని ఏది పడితే అది మాట్లాడడం సరికాదు
- బడ్జెట్ పై చర్చ సందర్భంగా నోరు పారేసుకున్న అచ్చెన్నాయుడు
- బ్లాక్ మనీ సూటుకేసుల్లో పెట్టుకొని పోయి ఎమ్మెల్యేలను కొన్నది ఎవరు?
- ప్రభుత్వానికి చురక అంటించిన వైయస్ జగన్
అమరావతి: బడ్జెట్ పై చర్చ సందర్భంగా మంత్రి అచ్చెన్నాయుడు మరోసారి ప్రతిపక్ష నేతపై నోరు పారేసుకున్నారు. సభను తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నించారు. వైయస్ జగన్ పై వ్యక్తిగత దూషణలకు దిగడంతో పాటు ఎదురుదాడి చేశారు. పవర్ ప్రాజెక్ట్ లపై చర్చలో మంత్రి వ్యాఖ్యలను వైయస్ జగన్ తప్పుబట్టారు. 2014-15-16లో ఆల్రెడీ ఖర్చు చేసిన వాటికి మళ్లీ టెండర్లను పిలవడమేంటని వైయస్ జగన్ ప్రశ్నించారు. తెలంగాణలో 4.46 కోట్ల మెగావాట్లు, గుజరాత్ లో 4.76 కోట్లు, ఇంకో చోట 3.96కోట్ల మెగావాట్లకు చేసిన చరిత్ర ఉంటే...ఇక్కడ బాబు హయాంలో 6.35కోట్లు మెగావాట్లు కృష్ణపట్నం, 5.86కోట్లు బీటీపీఎస్. అంటే 3వేల కోట్లు మెగావాట్ల కిట్ బ్యాగ్స్ జరిగిందని అన్నారు. బ్లాక్ మనీ సూటుకేసుల్లో పెట్టుకొని ఆడియో, వీడియో టేపుల్లో దొరికేట్టుగా ఎమ్మెల్యేలను కొని క్విడ్ ప్రోకో చేసింది ఎవరని ప్రభుత్వాన్ని నిలదీశారు. అధికార పక్షం నోరు తెరిస్తే అబద్ధాలు చెప్పడమే పనిగా పెట్టుకుందని విమర్శించారు. తనపై ఆరోపణలు చేయడం సరికాదని హితవు పలికారు.
ఎక్కడంటే అక్కడ సంతకాలు పెడతా...
నా ఆస్తులపై టీడీపీ పదేపదే దుష్ప్రచారం చేస్తోంది. రూ.43వేల కోట్లని మంత్రి అచ్చెన్నాయుడు అంటున్నారు. అందులో పదోవంతు ఇస్తే ఎక్కడంటే అక్కడ సంతకాలు పెడతా. 11 ఛార్జ్షీట్లతో తేలింది కేవలం రూ.1200 కోట్లు. అది కూడా సంబంధం లేని వాటిని ఛార్జిషీట్లో పేర్కొన్నారు. ఏబీసీ రికార్డుల ప్రకారం దేశంలోనే ’సాక్షి’ ఎనిమిదో స్థానంలో ఉంది. 1800 కోట్ల నష్టాల్లో ఉన్న ఈనాడు రూ.100 షేర్ను 5 లక్షల 26 వేలకు అమ్మితే ...మేం మా షేర్లను ఈనాడు కన్నా సగం ధరకే అమ్మాం. సాక్షి ఇన్వెస్టర్లంతా లాభాల్లోనే ఉన్నారు. టీడీపీ నేతలు రికార్డులు చూసి మాట్లాడటం నేర్చుకోవాలి. నోరుంది కదా అని ఏది పడితే అది మాట్లాడకూడదు.’ అని వైయస్ జగన్ అన్నారు. ఊరికే మాట్లాడటం చంద్రబాబుకు, అచ్చెన్నాయుడుకు అలవాటైందని దుయ్యబట్టారు. వైయస్ రాజశేఖరరెడ్డి చనిపోయాక, నేను కాంగ్రెస్ నుంచి బయటకు వెళ్లాక నాపై అక్రమ కేసులు పెట్టారు. చంద్రబాబు, కాంగ్రెస్ కుమ్మక్కై అచ్చెన్నాయుడు సోదరుడు ఎర్రన్నాయుడుతో కేసు వేయించారు.