అమరావతి: ఈ నెల 12న బీసీ అధ్యాయన కమిటీ సమావేశం నిర్వహిస్తున్నట్లు వైయస్ఆర్ సీపీ ప్రధాన కార్యదర్శి అనిల్ కుమార్ యాదవ్ తెలిపారు. ఇవాళ జరగవలసిన ఈ సమావేశం వాయిదా వేసినట్లు ఆయన వివరించారు. నిన్న అనంతపురం జిల్లాలో పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్ మోహన్ రెడ్డి బీసీలకు భరోసా కల్పించారని, వైయస్ఆర్సీపీఅధికారంలోకి వస్తేనే బడుగులకు న్యాయం జరుగుతుందని అందరు భావిస్తున్నట్లు ఆయన చెప్పారు.