జగన్మోహన్‌రెడ్డి కోసం జెరూసలెంలో ప్రార్థనలు

జెరూసలెం, 23 సెప్టెంబర్ 2013:

వైయస్ఆర్ కాంగ్రె‌స్ పార్టీ అధినేత‌ శ్రీ వైయస్ జగన్మోహన్‌రెడ్డికి బెయిల్ రావాలని కోరుతూ దేశవ్యాప్తంగా ప్రార్థనలు జరిగిన విషయం తెలిసిందే. అయితే, కేవలం ‌మన దేశంలోనే కాకుండా క్రైస్తవుల పవిత్ర క్షేత్రం జెరూసలెంలో కూడా తెలుగువారు శ్రీ జగన్మోహన్‌రెడ్డికి బెయిల్ కో‌సం ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. జానీ, పుల్లెల, ఎలిసా రాజు, నెహెమయ, జి.రాజు తదితరులు తమ కుటుంబాలతో సహా ఇంతకు ముందే వెళ్లి జెరూసలెంలో ప్రార్థనలు నిర్వహించారు. కాగా, శ్రీ జగన్‌కు సోమవారం సాయంత్రం బెయిల్ మంజూరు కావడంతో మరోసారి‌ వారంతా మరోసారి జెరూసలెం వెళ్లి కృతజ్ఞతా ప్రార్థనలు చేశారు.

Back to Top