వైయ‌స్ఆర్‌కు ‘భారతరత్న’ ఇవ్వాల‌ని కోటీ సంత‌కాల సేక‌ర‌ణ‌

 
 

 
అమెరికా: దివంగత ముఖ్య‌మంత్రి డాక్టర్ వైయ‌స్‌ రాజశేఖరరెడ్డికి దేశ అత్యున్నత పురస్కారం ‘భారతరత్న’ ప్రకటించాలని కోరుతూ కోటీ సంత‌కాల సేక‌ర‌ణ కార్య‌క్ర‌మం చేప‌ట్టాల‌ని  ఉత్తర అమెరికా తెలుగు సంఘం(నాటా) స‌భ‌లో తీర్మానించారు. అమెరికాలోని ఫిలడెల్ఫియా నగరంలో పెన్సిల్వేనియా కన్వెన్షన్‌ సెంటర్‌లో జరిగిన ‘నాటా’ మహా సంబరాల్లో  వైయ‌స్ఆర్‌సీపీ మాజీ ఎంపీలు వైవీ సుబ్బారెడ్డి, పీవీ మిథున్‌రెడ్డి, ఎమ్మెల్యేలు రవీంద్రనాథ్‌రెడ్డి, శ్రీనివాసులు, అనిల్‌కుమార్‌ యాదవ్, గౌరు చరితారెడ్డి, కోన రఘుపతి,   నాటా అడ్వైజరీ కౌన్సిల్‌ చైర్మన్‌ డాక్టర్‌ ప్రేమ్‌సాగర్‌రెడ్డి, నాయ‌కులు కారుమూరి నాగేశ్వరరావు, పార్టీ సీనియర్‌ నేతలు లక్ష్మీపార్వతి, శిల్పా చక్రపాణిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వైయ‌స్ఆర్ జీవిత చరిత్ర ఆధారంగా నిర్మితమవుతున్న సినిమా ‘యాత్ర’ టీజర్‌ను ఒంగోలు మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి ఆవిష్కరించారు.  

Back to Top