సగర కులస్తులకు వైయ‌స్‌ జగన్‌ శుభాకాంక్షలు 

 నేడు భగీరథ మహర్షి జయంతి.. 

తాడేపల్లి: నేడు భగీరథ మహర్షి జయంతి. ఈ సందర్భంగా వైయ‌స్ఆర్‌సీపీ అధినేత వైయ‌స్‌ జగన్‌.. సగర కులస్తులకు శుభాకాంక్షలు తెలిపారు. కఠోర శ్రమ, పట్టుదలతో ఎంతటి ఆశయాన్ని అయినా సాధించగలమని నిరూపించిన మహనీయులు భగీరథుడు అని కొనియాడారు.

వైయ‌స్‌ జగన్ `ఎక్స్` వేదికగా..

‘కఠోర తపస్సుతో గంగను భువికి తీసుకువ‌చ్చి ప్ర‌జ‌ల‌కు వ‌రంగా అందించిన మహా రుషి భ‌గీర‌థ మ‌హ‌ర్షి. కఠోర శ్రమ, పట్టుదలతో ఎంతటి ఆశయాన్ని అయినా సాధించగలమని నిరూపించిన మహనీయులు భగీరథుడు. నేడు భగీరథ మహర్షి జయంతి సందర్భంగా సగర కులస్తులకు శుభాకాంక్షలు’ చెప్పారు.

Back to Top