రేపు  గుంటూరు జిల్లాలో సీఎం  వైయ‌స్‌ జగన్‌ పర్యటన 

తాడేప‌ల్లి:  ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి గుంటూరు జిల్లాలో ప‌ర్య‌టించ‌నున్నారు. శుక్ర‌వారం ఉదయం 10.15 గంటలకు మంగళగిరి నియోజకవర్గం ఆత్మకూరులో అక్షయపాత్ర సెంట్రలైజ్డ్‌ కిచెన్‌ను సీఎం వైయ‌స్ జ‌గ‌న్ ప్రారంభించ‌నున్నారు. 

ఉద‌యం 11 గంటలకు తాడేపల్లి మండలం కొలనుకొండలో హరేకృష్ణ గోకుల క్షేత్రం భూమిపూజ కార్య‌క్ర‌మంలో ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ పాల్గొంటారు. ఇస్కాన్‌ (బెంగళూరు)కు చెందిన హరేకృష్ణ మూమెంట్‌ ఇండియా ఆద్వర్యంలో నిర్మాణం, ఆరున్నర ఎకరాలలో జాతీయ రహదారి పక్కన కొలనుకొండలో హరేకృష్ణ ప్రాజెక్ట్‌. ఆధ్యాత్మిక, సాంస్కృతిక కేంద్రంగా అభివృద్ది చేసేలా ఇస్కాన్‌ ప్రణాళికలు రూపొందించింది.

Back to Top