మంత్రి పదవుల్లో ఉన్నవాళ్లు చాలా జాగ్రత్తగా మాట్లాడాలిచంద్రబాబు నోరు తెరిస్తే అబద్ధాలేఅబద్ధపు హామీలు ఇవ్వటంలో టీడీపీ నేతలు దిట్టటీడీపీకి ఇవే చివరి ఎన్నికలు కావాలని కోరుకుంటున్నా! సోమిరెడ్డి సిగ్గు లేకుండా అబద్దాలు చెబుతున్నారుసీఎం వైయస్ జగన్తోనే సామాజిక న్యాయం సాధ్యంవైయస్ జగన్ సంక్షేమ పధకాలపై టీడీపీ దుష్ప్రచారం మరో జైత్రయాత్రకు సిద్ధం మేమంతా సిద్ధం బస్సు యాత్ర జైత్ర యాత్రగా సాగింది చంద్రబాబూ....డ్రామాలు కట్టిపెట్టు....
కాళీపట్నం రామారావు కుటుంబానికి ధర్మాన ప్రసాదరావు పరామర్శ
08 Jun 2021 12:31 PM
శ్రీకాకుళం: కథా నిలయం వ్యవస్థాపకులు, కేంద్రసాహిత్య అవార్డు గ్రహీత కాళీపట్నం రామారావు కుటుంబ సభ్యులను వైయస్ఆర్ సీపీ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు మంగళవారం పరామర్శించారు. శ్రీకాకుళంలోని తన స్వగృహంలో గత శుక్రవారం రామారావు తుదిశ్వాస విడిచారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు వారి ఇంటికి వెళ్లి తొలుత కారా మాస్టారు చిత్రపటానికి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు. చిన్న కథలతో, తనదైన కథా శైలితో ఆకట్టుకున్న ఉత్తరాంధ్రలోని సాహిత్యకారుల్లో ఆయన ప్రముఖుడని ధర్మాన గుర్తు చేశారు. రామారావు కుటుంబానికి అండగా ఉంటానని ధర్మాన హామీ ఇచ్చారు.