విజయనగరం: ఎమ్మెల్సీ అనంతబాబు వ్యవహారంలో చట్టం తనపని తాను చేసుకుపోతుందని మంత్రి బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు. ఎమ్మెల్సీ అనంతబాబును పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారని.. 302 సెక్షన్ కింద కేసు నమోదు చేశారని తెలిపారు. అందులో ప్రభుత్వం జోక్యం చేసుకోదన్నారు.