వైయస్ జగన్ సంక్షేమ పధకాలపై టీడీపీ దుష్ప్రచారం మరో జైత్రయాత్రకు సిద్ధం మేమంతా సిద్ధం బస్సు యాత్ర జైత్ర యాత్రగా సాగింది చంద్రబాబూ....డ్రామాలు కట్టిపెట్టు.... అ‘సామాన్యులు’ వైయస్ఆర్సీపీ అభ్యర్థులుఎంతమంది కలిసొచ్చినా వైయస్ఆర్సీపీ విజయాన్ని ఆపలేరుమాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత వీరశివారెడ్డి వైయస్ఆర్సీపీలో చేరిక కర్నూలు నియోజకవర్గంలో మళ్లీ వైయస్ఆర్సీపీదే విజయం ఓట్ ఫర్ ఫ్యాన్..ఆంధ్రప్రదేశ్ సిద్ధం..అభివృద్ధి, సంక్షేమంలో జగన్ విజన్
ఏపీలోనే నెంబర్వన్ అవినీతి ఎమ్మెల్యే పెందుర్తి..
22 Jan 2019 3:48 PM
కోరుకొండ నరసన్న కొండను సైతం తవ్వేశారు...
వైయస్ఆర్సీపీ నేత జక్కంపూడి విజయలక్ష్మి ఫైర్...
తూర్పుగోదావరి: రాజానగరం నియోజకవర్గం టీడీపీ ఎమ్మెల్యే పెందుర్తి వెంకటేష్ అవినీతిలో ఏపీలోనే నెంబర్వన్ అని వైయస్ఆర్సీపీ నేత జక్కంపూడి విజయలక్ష్మి అన్నారు.అనుచరులతో కలిసి కోట్లాది రూపాయలకు దోపిడీకి పాల్పడ్డారని మండిపడ్డారు.గోదావరిలో ఇసుక నుంచి.. చెరువులో మట్టి వరుకూ దేన్ని వదలకుండా మింగేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
కోరుకొండ లక్ష్మినరసింహస్వామి కొండను సైతం తవ్వేసి మట్టిని తరలించుకుపోయారని ఆరోపించారు.కాపు కార్పొరేషన్ లోన్లు ఇప్పిస్తామని సుమారు 2 కోట్ల రూపాయలు అవినీతికి పాల్పడ్డారన్నారు. ఎమ్మెల్యే అవినీతిని సాక్ష్యాధారాలతో సహా నిరూపించడానికి సిద్ధంగా ఉన్నామన్నారు.