ముందు టీడీపీ ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించు బాబూ? 

వైయ‌స్ఆర్‌సీపీ అధికార ప్ర‌తినిధి గుడివాడ అమ‌ర్‌నాథ్‌
 

విశాఖ‌: వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీకి  సవాల్ విసిరే ముందు టీడీపీకి చెందిన 23 మంది ఎమ్మెల్యేలతో చంద్రబాబు రాజీనామా చేయించాలని వైయ‌స్ఆర్‌సీపీ అధికార ప్ర‌తినిధి గుడివాడ అమ‌ర్‌నాథ్‌
 డిమాండ్ చేశారు.  సీఎం వైయ‌స్ జగన్ కు చంద్రబాబు 48 గంటల సమయం ఇవ్వడం తనను ఆశ్చర్యానికి గురి చేస్తోందని చెప్పారు. ఏడాదిన్నర క్రితం అమరావతి సహా రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ ఘోరంగా ఓడిపోయిన సంగతిని చంద్రబాబు మర్చిపోయారా? అని ప్రశ్నించారు.

 అమరావతిలో రియలెస్టేట్ వ్యాపారం కోసమే చంద్రబాబు రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకుంటున్నారని విమర్శించారు. మూడు రాజధానులతో రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయని... అందుకే అధికార వికేంద్రీకరణకు ప్రజలంతా ఆమోదం తెలుపుతున్నారని గుడివాడ అమ‌ర్‌నాథ్‌ చెప్పారు.

Back to Top