వైయ‌స్ఆర్‌సీపీ నేత‌  కొప్పన మోహనరావు కన్నుమూత

  తూర్పుగోదావరి:  వైయ‌స్ఆర్‌సీపీ నాయ‌కుడు, మాజీ మంత్రి కొప్పన మోహనరావు(75) బుధవారం కన్నుమూశారు. కాకినాడలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో అనారోగ్యంతో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఆయన పిఠాపురం నియోజకవర్గం నుంచి రెండు పర్యాయాలు(1978,1989) కాంగ్రెస్ పార్టీ తరఫున ఎమ్మెల్యేగా గెలుపొందారు. కోట్ల విజయభాస్కరరెడ్డి హయంలో అటవీ శాఖ మంత్రిగా పని చేశారు. పిఠాపురం నియోజకవర్గంలో కొప్పన వైయ‌స్ఆర్ ‌సీపీకి సేవలందించారు. ఆయన మృతి పట్ల ఎమ్మెల్యే పెండెం దొరబాబుతో పాటుగా పలువురు వైయ‌స్సార్‌సీపీ నేతలు సంతాపం వ్యక్తం చేశారు.

Back to Top