రేపు సీఎం వైయ‌స్‌ జగన్‌ విజయవాడ పర్యటన 

 తాడేప‌ల్లి:  ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి రేపు (19.01.2024) విజయవాడ న‌గ‌రంలో పర్యటించ‌నున్నారు. ఇందిరా గాంధీ మున్సిపల్‌ స్టేడియంలో సామాజిక సమతా సంకల్ప సభ, స్వరాజ్‌ మైదానంలో డా..బీఆర్‌ అంబేద్కర్‌ విగ్రహావిష్కరణ కార్యక్రమాలు ఏర్పాటు చేశారు.

సీఎం వైయ‌స్ జ‌గ‌న్ శుక్ర‌వారం సాయంత్రం 4.30 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి ఇందిరా గాంధీ మున్సిపల్‌ స్టేడియం చేరుకుంటారు. అక్కడ జరగనున్న సామాజిక సమతా సంకల్ప సభలో పాల్గొని ప్రసంగిస్తారు, అనంతరం అక్కడి నుంచి బయలుదేరి స్వరాజ్‌ మైదాన్‌ చేరుకుని డా..బీఆర్‌ అంబేద్కర్‌ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొంటారు. కార్యక్రమం అనంతరం రాత్రికి తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు.

Back to Top