మంత్రి పదవుల్లో ఉన్నవాళ్లు చాలా జాగ్రత్తగా మాట్లాడాలిచంద్రబాబు నోరు తెరిస్తే అబద్ధాలేఅబద్ధపు హామీలు ఇవ్వటంలో టీడీపీ నేతలు దిట్టటీడీపీకి ఇవే చివరి ఎన్నికలు కావాలని కోరుకుంటున్నా! సోమిరెడ్డి సిగ్గు లేకుండా అబద్దాలు చెబుతున్నారుసీఎం వైయస్ జగన్తోనే సామాజిక న్యాయం సాధ్యంవైయస్ జగన్ సంక్షేమ పధకాలపై టీడీపీ దుష్ప్రచారం మరో జైత్రయాత్రకు సిద్ధం మేమంతా సిద్ధం బస్సు యాత్ర జైత్ర యాత్రగా సాగింది చంద్రబాబూ....డ్రామాలు కట్టిపెట్టు....
ఉపాధ్యాయులకు సామాజిక భద్రత కరువు
21 May 2018 3:50 PM
పశ్చిమగోదావరి : ప్రజాసంకల్ప పాదయాత్ర చేస్తోన్న వైయస్ జగన్మోహన్రెడ్డిని ఉపాధ్యాయ జేఏసీ నాయకులు కలిసి తమ సమస్యలు విన్నవించారు. రాష్ట్రంలో ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించడంలో దివంగత మహానేత వైయస్ రాజశేఖరరెడ్డి ఉపాధ్యాయ, ఉద్యోగుల ఆదరాభిమానాలు చూరగొన్నారన్నారు. కానీ నేడు టీడీపీ ప్రభుత్వం ఉద్యోగులు, ఉపాధ్యాయులకు సామాజిక భద్రత లేకుండా చేసిందని ఉపాధ్యాయ జేఏసీ నాయకులు బీఏ సాల్మన్రాజు, జి.కృష్ణ, జి.సుధీర్, యూటీఎఫ్ జయకర్, నరహరి తదితరులు వాపోయారు. సీపీఎస్ విధానం కారణంగా పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయ కుటుంబం ఎటువంటి ఆర్థిక ఆసరా లేకుండా వీధిన పడే పరిస్థితి ఏర్పడిందన్నారు. సీపీఎస్ విధానంలో ఉద్యోగులు, ప్రభుత్వం పెట్టే పెట్టుబడి కార్పొరేట్ శక్తులకు సిరిగాను, ఉద్యోగులకు ఉరిలాగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. మీరు ముఖ్యమంత్రిగా అధికారంలోకి వచ్చిన తర్వాత వెంటనే సీపీఎస్ విధానాన్ని రద్దు చేసేలా హామీ ఇవ్వాలని కోరారు. ఉపాధ్యాయులకు ఆరోగ్య పథకం సక్రమంగా అమలు చేసి వైద్యసేవలు అందించాలని వైయస్ జగన్మోహన్రెడ్డిని కోరారు.