బాబు, పవన్లపై ఈసీకి వైయస్ఆర్సీపీ ఫిర్యాదుకూటమి ఛార్జ్షిట్..ఛార్జింగ్ లేని పార్టీల కామెడీ షో అసత్యాలు, అబద్ధాలతో ఎన్డీఏ కూటమి ఛార్జ్షిట్బీసీల గురించి మాట్లాడే అర్హత చంద్రబాబుకు లేదు కూటమి నేతలు విడుదల చేసిన ఛార్జ్షిట్ అబద్దాల పుట్ట రాయలసీమ కోసం పాటు పడే పార్టీ వైయస్ఆర్ కాంగ్రెస్ మీ తండ్రి కోసం పోరాడినందుకు నాకు మీరు ఇచ్చే గౌరవం ఇదా?మంత్రి పదవుల్లో ఉన్నవాళ్లు చాలా జాగ్రత్తగా మాట్లాడాలిచంద్రబాబు నోరు తెరిస్తే అబద్ధాలేఅబద్ధపు హామీలు ఇవ్వటంలో టీడీపీ నేతలు దిట్ట
మంత్రి దత్తత గ్రామంలో అభివృద్ధి ఉత్తదే..
20 Aug 2018 4:47 PM
జననేతను కలిసి ధర్మసాగరం గ్రామస్తులు
విశాఖపట్నం: మంత్రి అయ్యన్నపాత్రుడు దత్తత గ్రామంలో సమస్యలు విలయతాండవం చేస్తున్నాయి. పేరుకే దత్తత గ్రామం... అభివృద్ధి అంతా ఉత్తదేనని ప్రజలు మండిపడుతున్నారు. అయ్యన్నపాత్రుడు కుటుంబం దత్తత తీసుకున్న ధర్మసాగరంలో కనీస సౌకర్యాలు లేక ఇబ్బందులు పడుతున్నామని ప్రజలు ప్రతిపక్షనేత వైయస్ జగన్మోహన్రెడ్డిని కలిసి కన్నీరు పెట్టుకున్నారు. ఎస్సీకాలనీల్లో రోడ్లు సరిగ్గా లేవు, మంచినీరు రావడం లేదని, వీధి దీపాలు వెలగడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అదే విధంగా ధర్మసాగరం ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేయాలని జననేతను విజ్ఞప్తి చేశారు. అధికారంలోకి రాగానే ఎత్తిపోతల ప్రాజెక్టు పూర్తిచేస్తానని హామీ ఇచ్చారని గ్రామస్తులంతా సంతోషం వ్యక్తం చేశారు.