చంద్రబాబు విలేకరుల సమావేశం ఏర్పాటు చేసాడునగదు రహితంపై ముఖ్యమంత్రుల కమిటీ ఏం తేల్చింది? అని అడిగారు విలేకరులుఈ దేశంలో 80 శాతం మందిలో నగదు లేదు. మిగిలిన 20 శాతం మందికి నగదు అందకుండా చేసాం. ఆ రకంగా నగదు రహితం సాధించాంచదువులేని పేదవాళ్లు డిజిటల్ చెల్లింపులు ఎలా చేస్తారుఏదైనా నేర్చుకుంటే వస్తుంది. అందుకే స్మార్ట్ ఫోన్లపై రాయితీలు ఇస్తున్నాంఫోన్ల కంపెనీతో డీల్ కుదిరిందా?మీరు ప్రతి దాన్ని అనుమానిస్తారు. ఈ దేశం సామాన్యున్ని కూడా చైతన్యపరచడమే మా ధ్యేయంధ్యేయం బానే వుంది. కానీ ప్రతి మనిషికి కావాల్సింది తిండి కదా. అది లేకుండా స్మార్ట్ ఫోన్ ని ఏం చేస్తారు? కొరుక్కుతింటారుఎప్పుడూ తిండి తిండి అంటూ వుంటాం కాబట్టి మనం వెనుకబడి వున్నాంఈ రోజు మీరేం తిన్నారు?డ్రైఫ్రూట్స్, వెజిటబుల్ సలాడ్, నేను తినేదంతా ప్రోటీన్ ఫుడ్డే<br/>మీరు జనం సొమ్ము బాగా తినేసారు కాబట్టి ప్రోటీన్ ఫుడ్డు తింటున్నారు. కానీ సామాన్యజనానికి పొటాటోలు కూడ దొరకడం లేదుఎవరికి వాళ్లే సంపాదించుకోవాలినగదుని రద్దు చేసి అందరినీ రోడ్డుమీదకి ఈడ్చారు. ఇంకేం సంపాదించుకుంటారునేను చేపలు వడ్డించాను, చేపలు పట్టేది నేర్పిస్తానుమీకు ఓట్లేసి జనం వలలో చిక్కుకున్న చేపల్లా గిలగిల్లాడుతున్నారువలలో చిక్కితే అది వాళ్ల తప్పుఇప్పటికైనా ప్రజల గురించి ఆలోచించండినేను 24 గంటలూ అదే ఆలోచిస్తా. ప్రజలకే నా హృదయం అంకితం.ఏమి ఆలోచిస్తున్నారు?అమరావతిని విశ్వనగరం ఎలా చేయాలి? 8 లేన్ల రోడ్డు నిర్మించాలి. రైతుల భూములన్నీ లాక్కుని బడాబాబులకి పంచిపెట్టాలిఇందులో జనానికి పనికొచ్చే విషయం ఒకటి చెప్పండిరోడ్లు వేస్తే దర్నీ ఈజీ అయిపోతుంది కదామీ అధికారులకి, కాంట్రాక్టర్లకి ఈజీ అయిపోతుంది. ఒక రైతుకి, కార్మికుడికి ఏం జరుగుతుంది?వాళ్లు కూడా ప్రయోగాలు చేస్తారు కదాగతంలో కూలి దొరక్క వలస వెళ్లే వారు. మోదీ పుణ్యమా అని దేశంలో ఎక్కడా కూలీ దొరకడం లేదుఅయితే ఇప్పుడేం చేయమంటారుమీరేం చేయక్కర్లేదు. రేపు ఎన్నికల్లో ప్రజలే చేయాల్సింది చేస్తారు