రేపు టీటీడీ చైర్మ‌న్‌గా వైవీ సుబ్బారెడ్డి బాధ్య‌త‌ల స్వీక‌ర‌ణ‌

అమరావతి: తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) బోర్డు చైర్మన్‌గా వైయ‌స్ఆర్‌సీపీ సీనియర్‌ నేత, లోక్‌సభ మాజీ సభ్యుడు వైవీ సుబ్బారెడ్డి శనివారం ఉదయం 11 గంటలకు బాధ్యతలు స్వీకరించనున్నారు. వైవీ సుబ్బారెడ్డి గత లోక్‌సభలో ఒంగోలు నియోజకవర్గం నుంచి ప్రాతినిథ్యం వహించారు. ప్రత్యేక హోదా కోసం పార్లమెంట్‌లో జరిగిన పోరాటంలో సుబ్బారెడ్డి పార్టీ తరపున అగ్రభాగాన నిలిచారు. చివరకు సహచర ఎంపీలతో పాటుగా పదవీ త్యాగం చేశారు.  

Back to Top