బ్రాహ్మణి, భువనేశ్వరి మహిళలేనా.. అసలు మనుషులేనా..?

మంత్రి రోజా కన్నీళ్లు చూసి ఆనందపడతారా..?

ఎన్టీఆర్ కన్నీళ్ల‌నే చూసి కనికరించని, చలించని కూతురు భువనేశ్వరి

అఫిడవిట్‌లో ఎన్నికల కమిషన్ చూపించిన ఆస్తులు ఎంత..? ఈ వేల కోట్లు చూపించారా..? 

బాలకృష్ణ సర్టిఫైడ్ సైకో..మహిళల పాలిట మరో సైకో పవన్

వైయ‌స్ఆర్ సీపీ అధికార ప్ర‌తినిధి, ప్ర‌భుత్వ స‌ల‌హాదారు నారమల్లి పద్మజ

తాడేప‌ల్లి: ఇన్నాళ్లూ నిప్పు అని, సచ్ఛీలుడినని చెప్పుకుంటూ తిరిగిన చంద్రబాబు స్కిల్ స్కాంలో రూ. 371 కోట్లు కొట్టేసి, చట్టానికి అడ్డంగా దొరికిపోయాడని, బాబును ఏసీబీ కోర్టు రిమాండ్ విధించి జైలుకు పంపితే.. ఆ ఫ్రస్ట్రేషన్‌లో టీడీపీ నేతలు నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని వైయ‌స్ఆర్ సీపీ అధికార ప్రతినిధి, ప్ర‌భుత్వ స‌ల‌హాదారు నారమల్లి పద్మజ అన్నారు. టీడీపీ నేతల వికృత చేష్టలు, మాటలు పరాకాష్టకు చేరాయని, ఇందులో భాగంగానే మంత్రి రోజాపై టీడీపీ నేతలు అసభ్యంగా మాట్లాడుతూ ఆమె వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నారని మండిప‌డ్డారు. టీడీపీ నేత బండారు సత్యనారాయణ మాట్లాడిన మాటలకు ఆయనపై చట్టపరంగా చర్యలు తీసుకుంటారని, బండారు నీచ మాటలను సమర్థిస్తున్న నారా లోకేష్, పవన్ కల్యాణ్‌లకు ప్రజలు త‌గిన బుద్ధి చెబుతారన్నారు. మహిళలైన నారా బ్రాహ్మణి, నారా భువనేశ్వరీలు బండారు వ్యాఖ్య‌ల‌ను ఎందుకు ఖండించ‌లేద‌ని, ఒక మహిళా మంత్రి రోజా కన్నీళ్లు చూసి ఆనందపడుతున్నారా? అని ప్ర‌శ్నించారు. బ్రాహ్మ‌ణి, భువ‌నేశ్వ‌రి  అసలు మహిళలేనా..?  కనీసం  మనుషులేనా..? అని అనిపిస్తుందన్నారు. వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాల‌యంలో నారమల్లి పద్మజ విలేక‌రుల స‌మావేశం నిర్వ‌హించారు. 

నారమల్లి పద్మజ ఇంకా ఏం మాట్లాడారంటే.. 

సోషల్ మీడియాలో వచ్చిన మాటలను పట్టుకుని.. టీడీపీ నేతలు అయ్యన్నపాత్రుడు, పట్టాభి, బండారు సత్యనారాయణ, అనిత లాంటి వాళ్ళు.. మంత్రి రోజాపై నోటికొచ్చినట్లు, అసభ్య పదజాలాలతో మాట్లాడుతూ ఆమె క్యారెక్టర్ ను అసాసినేట్ చేస్తుంటే.. నారా బ్రాహ్మణి, నారా భువనేశ్వరిలు ఖండించటం లేదంటే వీరిని ఏమనాలి..? రాజకీయాల్లో 20 ఏళ్ళుగా సక్సెస్ ఫుల్ మహిళగా, ఒక ఫైటర్‌గా, రెండుసార్లు ఎమ్మెల్యేగా, ప్రస్తుతం మంత్రిగా ఉన్న రోజాపై టీడీపీ నేతలు పనిగట్టుకుని క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తున్నారు. ఇదెంతవరకు న్యాయం..? 

మొన్న భువనేశ్వరి దీక్షలో.. ఒక చిన్న పిల్లాడికి ఎల్లో డ్రస్ వేసి.. దివంగ‌త మ‌హానేత వైయ‌స్ రాజశేఖరరెడ్డి గురించి, ఆయన మరణాన్ని గురించి, మాంసం ముద్దలు గురించి మాట్లాడిస్తుంటే, ఆ మాటలను చూసి భువనేశ్వరి చేతులు ఎత్తి మరీ చప్పట్లు కొడుతున్నారంటే.. వీళ్ళను ఏమనాలి..? వీళ్ళ వికటాట్టహాసాలు చూస్తుంటే.. అసలు వైయ‌స్ఆర్‌ మరణానికి కారణభూతులు వీరేనా అనే అనుమానం క‌లుగుతోంది. 

తన తండ్రి ఎన్టీఆర్‌కి వెన్నుపోటు పొడిచి, ఆయన పదవిని, ట్రస్టును, పార్టీని, డబ్బులను లాక్కుని, వైశ్రాయ్ హోటల్ దగ్గర తండ్రిపై చంద్ర‌బాబు చెప్పులు వేయిస్తే .. భువనేశ్వరికి కన్నీళ్ళు కూడా రాలేదు. ఆరోజు తన భర్త చేసిన తప్పులను నిలదీయలేకపోయింది. ఇదే మాదిరిగా ఆమె దీక్ష చేయలేకపోయింది. ఆమెను చూస్తుంటే.. ఆమెలో స్త్రీతత్వం పక్కన పెడితే, కనీసం దయ, కరుణ కూడా కనిపించడం లేదు. పైగా, తన భర్త చేసిన అవినీతిని కప్పిపుచ్చుతూ, తమ వ్యాపారంలో 2 శాతం అమ్మితే.. రూ. 400 కోట్లు వస్తాయని మాట్లాడుతుంది అంటే.. చంద్రబాబు అవినీతిలో ఈమె భాగస్వామ్యం ఎంత అనే అనుమానాలు వస్తున్నాయి. ఎన్టీఆర్ కన్నీళ్ళనే చూసి కనికరించని, చలించని కూతురు భువనేశ్వరి.. ఈరోజు ఏదో జరిగిపోతుందని మాట్లాడుతున్నారు. చంద్రబాబు ఏం చేసినా, ఎన్ని అరాచకాలు చేసినా వెనకేసుకొస్తున్న నారా భువనేశ్వరిని చూస్తుంటే.. ఈ స్కాములకు కుట్రదారు కూడా ఆమెనేమో అనే అనుమానం వస్తుంది. అఫిడవిట్ లో ఎన్నికల కమిషన్ కు మీరు ప్రకటించిన ఆస్తులు ఎంత..? ఈ వేల కోట్లు చూపించారా..? దానిమీద సమాధానం చెప్పండి. 

చంద్రబాబు హయాంలో, టీడీపీ ప్రజా ప్రతినిధులైన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల సహకారంతోనే, వారి కనుసన్నల్లోనే కాల్ మనీ సెక్స్  పేరుతో మహిళల జీవితాలతో చెలగాటమాడితే.. మహిళగా కాకపోయినా.. కనీసం మనిషిగా అయినా టీడీపీ మహిళా అధ్యక్షురాలు అనిత మాట్లాడిందా..?

బ్లూ ఫిల్మ్ లు మీ దగ్గర ఉంటే బయటపెట్టండి. రోజా భర్త, ఆమె కూడా ఛాలెంజ్ చేశారు. మీరెందుకు సిద్ధంగా లేరు. అంటే మీవన్నీ గాలి మాటలని అర్థం కావటం లేదా..? 175లో 151 అసెంబ్లీ సీట్లు, 25లో 22 ఎంపీలు సాధించి ముఖ్యమంత్రిగా ఉన్న సీఎంని పట్టుకుని వీళ్ళు సైకో అంటారు. మహిళలు కనిపిస్తే ముద్దు అయినా పెట్టుకోవాలి- కడుపు అయినా చేయాలన్న బాలకృష్ణ ఒక సర్టిఫైడ్ సైకో.. ఈరోజు మీకు కాపలాదారుడిగా ఉన్న పవన్ కల్యాణ్- మహిళల పట్ల ఎంత దారుణంగా వ్యవహరించాడో దేశమంతా చూసింది. అతను మరో సైకో.. 

ముసలమ్మను కొట్టి మూలన కూర్చోబెట్టినట్టు చంద్రబాబును జైల్లో కూర్చోబెట్టారని నిన్న కూడా పబ్లిక్ మీటింగ్ లో పవన్ కల్యాణ్ మాట్లాడాడు. అంటే మహిళల పట్ల అతనికి ఉన్న గౌరవం ఇదేనా..? వనజాక్షి లాంటి మహిళా అధికారిని కొట్టిన నేతలు కూడా టీడీపీలో కొనసాగుతున్నారంటే.. మీది దుశ్యాసనుల పార్టీ కాదా..? మేం మాధవరెడ్డి హత్య గురించి మాట్లాడితే.. దొంగ ఏడుపులు ఏడ్చిన మీరు.. బ్లూ ఫిలింలు అంటూ రోజా వ్యక్తిత్వాన్ని ఎందుకు హననం చేస్తున్నారు. 

మహిళా సాధికారతకు ముఖ్యమంత్రి వైయ‌స్ జగన్ పెద్ద పీట వేశారు.  ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, మహిళలకు, పేదలకు గత నాలుగేళ్ళలో రూ. 2.35 లక్షల కోట్లు డీబీటీ ద్వారా ఇవ్వటమే కాకుండా,  ఎంతో మంది మహిళలను మేయర్లుగా, జెడ్పీ ఛైర్మన్లుగా చేశారు. దేశంలో ఇవాళ 33 శాతం మహిళా రిజర్వేషన్ల కోసం చర్చ జరుగుతుంటే.. అంతకు మించి  నామినేటెడ్ పదవుల్లో, నామినేషన్ పనుల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ.. ఏకంగా చట్టం చేసి, మహిళల సాధికారతకు బాటలు వేస్తున్న ఘ‌న‌త‌ ముఖ్యమంత్రి వైయ‌స్ జగన్‌కే సొంతం.

Back to Top