చంద్రబాబుకు ప్రజల ఉసురు తప్పక తగులుతుంది

వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి

తాడేపల్లి: ప్రాజెక్టులకు బ్రేకులు వేసేందుకు చంద్రబాబు మళ్లీ కుట్రలు మొదలుపెట్టాడని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌పార్టీ రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి ధ్వజమెత్తారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్‌ వేదికగా స్పందిస్తూ.. ‘గతంలో మహానేత వైయస్‌ఆర్‌ సీఎంగా ఉండగా జలయజ్ఞం ప్రాజెక్టులకు ఆటంకాలు కల్పించినట్టుగానే  రాయలసీమ ఎత్తపోతల పథకాలకు బ్రేకులు వేసే కుట్రలు మొదలుపెట్టాడు చంద్రబాబు. ట్రిబ్యునల్స్, కోర్టుల్లో కేసులు వేయించి అనుమతులను అడ్డుకోవాలని చూస్తే ప్రజల ఉసురు తప్పక తగులుతుంది’ అని ఎంపీ విజయసాయిరెడ్డి ట్వీట్‌ చేశారు. 
 

తాజా వీడియోలు

Back to Top