ఆ ద్రోహం మీ బాబుదే రామోజీబాబు, పవన్లపై ఈసీకి వైయస్ఆర్సీపీ ఫిర్యాదుకూటమి ఛార్జ్షిట్..ఛార్జింగ్ లేని పార్టీల కామెడీ షో అసత్యాలు, అబద్ధాలతో ఎన్డీఏ కూటమి ఛార్జ్షిట్బీసీల గురించి మాట్లాడే అర్హత చంద్రబాబుకు లేదు కూటమి నేతలు విడుదల చేసిన ఛార్జ్షిట్ అబద్దాల పుట్ట రాయలసీమ కోసం పాటు పడే పార్టీ వైయస్ఆర్ కాంగ్రెస్ మీ తండ్రి కోసం పోరాడినందుకు నాకు మీరు ఇచ్చే గౌరవం ఇదా?మంత్రి పదవుల్లో ఉన్నవాళ్లు చాలా జాగ్రత్తగా మాట్లాడాలిచంద్రబాబు నోరు తెరిస్తే అబద్ధాలే
‘ఐదేళ్లు అధికారంలో ఉండి చేసింది అదే కదా’
10 Sep 2019 12:39 PM
అమరావతి: చంద్రబాబు అధికారంలో ఉన్నన్నాళ్లు పోలీసులను పచ్చ పార్టీ నేతలుగా మార్చుకున్నారని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. అందుకే పచ్చ నేతల అవినీతిని బయటపెట్టేందుకు ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి సీబీఐతో దర్యాప్తు చేయిస్తున్నారని వెల్లడించారు. ‘మీ పాలనలో వ్యవస్థలన్నింటినీ నిర్వీర్వం చేసి పోలీసులకు పచ్చ యూనిఫాం తొడిగించారు. అందుకే సీఎం వైయస్ జగన్ నాడు సీబీఐ దర్యాప్తు కోసం డిమాండ్ చేశారు. ఇప్పుడు పోలీసులు స్వేచ్ఛగా పనిచేస్తున్నారు. డౌట్ ఉంటే శాంపిల్గా కోడెల కుటుంబం కేసులను సీబీఐకి అప్పగించమని అడగొచ్చుగా చంద్రబాబు గారూ’ అని అన్నారు.
‘పచ్చ దొంగలకు అమరావతి తప్ప ఇంకేది పట్టదు. లక్షల కోట్ల రియల్ ఎస్టేట్ రాబడుల గురించే ధ్యాసంతా. అందుకే ఏదో ఒక కృత్రిమ సమస్యను సృష్టించి అనుకూల మీడియాతో అలజడి లేపాలని చూస్తున్నారు. ఐదేళ్లు అధికారంలో ఉండి నారా చంద్రబాబు, లోకేష్ చేసింది అదే కదా’ అని ట్వీట్ చేశారు.