చంద్ర‌మౌళిరెడ్డి పార్థివ దేహానికి వైయ‌స్ఆర్‌సీపీ నేత‌ల నివాళులు

నంద్యాల‌: తిరు­మల తిరుపతి దేవస్థానాల (టీటీడీ) ఈవో ఎ.వి.ధర్మారెడ్డి కుమారుడు చంద్రమౌళిరెడ్డి అలియాస్‌ శివ (28) పార్థివ దేహానికి వైయ‌స్ఆర్‌సీపీ సీనియ‌ర్ నేత‌లు వైవీ సుబ్బారెడ్డి, భూమ‌న క‌రుణాక‌ర్‌రెడ్డి, వేమిరెడ్డి ప్ర‌భాక‌ర్‌రెడ్డి, కాట‌సాని రాంభూపాల్‌రెడ్డి త‌దిత‌రులు నివాలుల‌ర్పించారు. చంద్ర‌మౌళిరెడ్డి చెన్నై కావేరి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుధవారం ఉదయం 8.20 గంటలకు కన్నుమూశారు.  చెన్నైలో బీటెక్‌ పూర్తిచేసి ముంబైలో ఫైనాన్స్‌ కన్సల్టెంటుగా ఉద్యోగం చేస్తున్న చంద్రమౌళి ఈనెల 18వ తేదీన చెన్నైలో తన స్నేహితుడితో కలిసి కారులో వెళ్తున్న సమయంలో గుండెపోటుకు గురయ్యారు. దీంతో ఆయన్ని ఆళ్వార్‌పేటలోని కావేరి ఆస్పత్రికి తరలించారు. కార్డియాక్‌ అరెస్ట్‌తో ఆస్పత్రిలో చేరిన చంద్రమౌళికి ఎక్మో చికిత్స అందించినా ఫ‌లితం ద‌క్క‌లేదు.  చంద్రమౌళి భౌతికకాయాన్ని ధర్మారెడ్డి స్వగ్రామం నంద్యాల జిల్లా జూపాడుబంగ్లా మండలం పారుమంచాలకు ప్రత్యేక అంబులెన్స్‌లో మధ్యాహ్నం 12 గంటల సమయంలో చెన్నై నుంచి తరలించారు. మ‌ధ్యాహ్నం ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి పారుమంచాల గ్రామానికి చేరుకొని  చంద్రమౌళి పార్థిక దేహానికి నివాళుల‌ర్పించ‌నున్నారు.   

Back to Top