బాబు పాలనలో విచ్చలవిడి అవినీతి

మాజీ మంత్రి డీఎల్‌ రవీంద్రారెడ్డి
 

అమరావతి: చంద్రబాబు పాలనలో విచ్చలవిడిగా అవినీతి జరిగిందని వైయస్‌ఆర్‌సీపీ నేత, మాజీ మంత్రి డీఎల్‌ రవీంద్రారెడ్డి విమర్శించారు.కుప్పంలో హంద్రీనీవా పనుల్లో అంచనాలు పెంచి దోచుకున్నారని ఆరోపించారు. పోలవరం పనుల్లో యనమల రామకృష్ణుడు కమీషన్లు తీసుకోవడం సిగ్గు చేటు అన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖరరెడ్డి చేపట్టిన ప్రాజెక్టులను చూపి చంద్రబాబు ప్రచారం చేసుకున్నారన్నారు. ఆప్కోలో జరిగిన అవినీతిపై విచారణ జరపాలని ప్రభుత్వాన్ని డీఎల్‌ కోరారు. 
 

Back to Top