బాబు, పవన్లపై ఈసీకి వైయస్ఆర్సీపీ ఫిర్యాదుకూటమి ఛార్జ్షిట్..ఛార్జింగ్ లేని పార్టీల కామెడీ షో అసత్యాలు, అబద్ధాలతో ఎన్డీఏ కూటమి ఛార్జ్షిట్బీసీల గురించి మాట్లాడే అర్హత చంద్రబాబుకు లేదు కూటమి నేతలు విడుదల చేసిన ఛార్జ్షిట్ అబద్దాల పుట్ట రాయలసీమ కోసం పాటు పడే పార్టీ వైయస్ఆర్ కాంగ్రెస్ మీ తండ్రి కోసం పోరాడినందుకు నాకు మీరు ఇచ్చే గౌరవం ఇదా?మంత్రి పదవుల్లో ఉన్నవాళ్లు చాలా జాగ్రత్తగా మాట్లాడాలిచంద్రబాబు నోరు తెరిస్తే అబద్ధాలేఅబద్ధపు హామీలు ఇవ్వటంలో టీడీపీ నేతలు దిట్ట
కోటంరెడ్డి బ్రదర్స్ తినే ప్రతి మెతుకు వైయస్ జగన్ పెట్టిన భిక్షే
01 Feb 2023 3:05 PM
వైయస్ఆర్సీపీ నేత ఆనం విజయ్ కుమార్రెడ్డి
నెల్లూరు: నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి బ్రదర్స్ తినే ప్రతి మెతుకు సీఎం వైయస్ జగన్ పెట్టిన భిక్షే అని వైయస్ఆర్సీపీ నేత ఆనం విజయ్ కుమార్రెడ్డి అన్నారు. టీడీపీతో కుమ్మక్కై అన్నం పెట్టిన పార్టీపై అభాండాలు వేయడం దారుణమన్నారు. నెల్లూరు జిల్లాలో అనవసరమైన వాతావరణాన్ని సృష్టిస్తున్నారు. అధిష్టానం గుర్తిస్తేనే ఎవరైనా ఎమ్మెల్యే కాగలరని చెప్పారు. కోటంరెడ్డి పార్టీలో గుర్తింపు లేదనడం భావ్యం కాదన్నారు. పార్టీ నుంచి వెళ్లాలని కోటంరెడ్డికి ఎవరూ చెప్పలేదన్నారు. నెల జీతాలిచ్చి రౌడీషీటర్లను పెట్టుకొని దందాలు చేసిన వ్యక్తి కోటంరెడ్డి అని విమర్శించారు. కోటంరెడ్డి సోదరులు రాక్షసులుగా వ్యవహరించారని మండిపడ్డారు. కౌన్సిలర్ స్థాయి కూడా లేని కోటంరెడ్డిని వైయస్ జగన్ ఎమ్మెల్యేని చేశారని గుర్తు చేశారు. కోటంరెడ్డి ఫోన్ ట్యాపింగ్ చేయాల్సిన అవసరం ప్రభుత్వానికి లేదని ఆనం విజయ్ కుమార్రెడ్డి స్పష్టం చేశారు.