తిరుపతి జిల్లా: తిరుపతి డిప్యూటీ మేయర్ ఉప ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థికి ఓటు వేసి తప్పు చేశామని నలుగురు వైయస్ఆర్సీపీ కార్పొరేటర్లు మాజీ మంత్రి, భూమన కరుణాకర్రెడ్డి కాళ్ల మీద పడి క్షమాపణలు కోరారు. డిప్యూటీ మేయర్ ఎన్నిక అనంతరం భూమన కరుణాకర్రెడ్డి నివాసానికి టీడీపీకి ఓటేసిన నలుగురు వైయస్ఆర్సీపీ కార్పొరేటర్లు వచ్చారు. బెదిరించి కూటమికి ఓట్లు వేయించారని ఆవేదన వ్యక్తం చేశారు. తప్పు అయిందంటూ భూమన కాళ్లమీద పడి క్షమాపణ కోరారు. కూటమి నేతలు తమను కొట్టి బెదిరించారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా నలుగురు కార్పొరేటర్లు మీడియాతో మాట్లాడుతూ.. `పశ్చాత్తాపంతో తమను క్షమించమని వేడుకుంటూ భూమన కరుణాకరరెడ్డిని మేం నలుగురం (కార్పొరేటర్లు) అనీష్, అనిల్, మోహన్ కృష్ణ యాదవ్, అమరనాథ్ రెడ్డిలు ప్రాధేయపడ్డాం. తామంతా వైయస్ఆర్సీపీ అధినేత, మాజీ సీఎం వైయస్ జగన్మోహన్రెడ్డి నాయకత్వం కోరుకునే వాళ్ళమని, మమ్మల్ని భయపెట్టి, ఆర్థికంగా ఇబ్బందులకు గురి చేస్తామని బెదిరించి కిడ్నాప్ చేశారు. వాళ్ళకి భయపడి ఓటు వేయాల్సి వచ్చింది, తప్పు జరిగి పోయింది క్షమించమని కరుణాకర్ రెడ్డిని వేడుకుంటున్నాం` ఎత్తుకెళ్లి మాపై భౌతికంగా దాడి చేసి, ఇబ్బందులు పెట్టారు. ఓటు వేయకుంటే ఇబ్బందులు తప్పవని హెచ్చరించారు..భయపెట్టారు` అని కార్పొరేటర్లు అనీష్ రాయల్ , అనిల్, మోహన్ కృష్ణ యాదవ్ మీడియా ఎదుట వాపోయారు. వైయస్ఆర్సీపీలోనే కొనసాగుతా: నన్ను ఎంతగా భయపెట్టినా టీడీపీకు అనుకూలంగా ఓటు వేయను అని స్పష్టం చేశాను. భయపెట్టి, బెదిరింపులకు పాల్పడ్డారు. నేను ఎవరికీ ఓటు వేయకుండా తటస్థంగా ఉన్నాను. నేను వైయస్ఆర్సీపీలో గెలిచాను, ఆ పార్టీలోనే చివరి వరకు కొనసాగుతా. జరిగిన పరిస్థితులు అర్థం చేసుకుంటారని, పశ్చాత్తాపంతో కరుణాకర్ రెడ్డి వద్దకు వచ్చానని 5వ డివిజన్ కార్పొరేటర్ అమరనాథ్ రెడ్డి స్పష్టం చేశారు. కూటమి క్యాన్సర్ కంటే ప్రమాదం: భూమన కరుణాకర్రెడ్డి కూటమి సర్కార్ క్యాన్సర్ కంటే ప్రమాదకరమని వైయస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి భూమన కరుణాకర్రెడ్డి మండిపడ్డారు.డిప్యూటీ మేయర్ ఉప ఎన్నికలో కూటమి సర్కార్ మోసంతో గెలిచిందన్నారు. వైయస్ఆర్సీపీ కార్పొరేటర్లను కిడ్నాప్ చేసి బెదిరించారని, అయినా వీరోచితంగా పోరాటం చేశారని చెప్పారు. ఎమ్మెల్సీనే ఓటింగ్కు రాకుండా చేసిన ఘనత కూటమి ప్రభుత్వానిదే అన్నారు. తిరుపతి మేయర్ను దించాలని ప్రభుత్వం కుట్ర చేస్తుందని ఆక్షేపించారు.