తాడేపల్లి: బంకిమ్ చంద్ర చటర్జీ 1875లో రచించిన వందేమాతరం దేశభక్తి గీతం 150 ఏళ్ల స్పూర్తిపై వైయస్ఆర్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైయస్ జగన్మోహన్రెడ్డి తన సోషల్ మీడియా అకౌంట్ ‘ఎక్స్’ లో ట్వీట్ చేశారు. 'వందేమాతరం' 150 సంవత్సరాల స్ఫూర్తికి నా వందనం. బంకిం చంద్ర ఛటర్జీ గారు రచించిన ఈ పవిత్ర గీతం మన స్వాతంత్య్ర సమరయోధులలో రగిలించిన ఐక్యతా భావనే మనందరికీ ఆదర్శం. ఆ స్ఫూర్తితో మన భావితరాల కోసం, వారి అభివృద్ధికోసం కలిసి పనిచేద్దాం’ అని వైయస్ జగన్ పిలుపునిచ్చారు.