చంద్రబాబు మాట్లాడిన ప్రతి మాట అబద్ధమే మేమంతా సిద్ధం - 18వ రోజు షెడ్యూల్ఉరకలేసిన జనగోదావరి సీఎం వైయస్ జగన్పై దాడి పక్కా ప్రణాళికతో చేసిందేచంద్రబాబు వళ్లంతా దళితుల రక్తంతోనే తడిచింది...!కడియపులంకలో పోటెత్తిన జనం చంద్రబాబుకు ఓటుకు నోటు కేసులో శిక్ష తప్పదుజగనన్నే మా భరోసా బస్సు దిగి అంబులెన్స్లోని పేషెంట్ వద్దకు సీఎంగోదారమ్మ సాక్షిగా రావులపాలెంలో ఉప్పొంగిన జన గోదావరి
వివేకానందరెడ్డి హత్యకేసుపై వైఎస్ జగన్ పిటిషన్
20 Mar 2019 9:43 AM
స్వతంత్ర సంస్థతో దర్యాప్తు జరిపించాలి
సిట్పై నమ్మకం లేదు
అమరావతి : మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసును స్వతంత్ర సంస్థతో దర్యాప్తు జరిపించాలని వైయస్ఆర్సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ క్రమంలో వైఎస్ వివేకానందరెడ్డి హత్యను చిన్నదిగా చూపించేందుకు సీఎం ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. వ్యక్తిగత ప్రయోజనాల కోసం ఆయన ఈ హత్యను రాజకీయంగా వాడుకుంటున్నారని వైఎస్ జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ విచారణ వల్ల వాస్తవాలు బయటకు వస్తాయనే నమ్మకం లేదు కాబట్టి స్వతంత్ర దర్యాప్తు సంస్థకు ఈ కేసును అప్పగించాలని ఆయన పేర్కొన్నారు. వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులో.. తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడు, ఏపీ డీజీపీ, కేంద్ర ప్రభుత్వం, సీబీఐ తదితర ఎనిమిది మందిని పిటిషనర్ వైఎస్ జగన్ ప్రతివాదులుగా చేర్చారు. రాష్ట్ర ప్రభుత్వం, ఏపీ పోలీసుల అజమాయిషీ లేని స్వచ్ఛంద దర్యాప్తు సంస్థచేత విచారణ జరిపించాలని న్యాయస్థానాన్ని కోరారు.