తాడేపల్లి: ఏపీలో పోర్టుల ద్వారా జరిగే అభివృద్ధి, మన రాష్ట్రాన్ని మార్చే ఆర్థిక వృద్ధికి ఇంజిన్ లాంటిది అని వైయస్ఆర్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి అభివర్ణించారు. పోర్టుల అభివృద్ధి విషయమై వైయస్ జగన్ తన ఎక్స్ ఖాతాలో కీలక వ్యాఖ్యలు చేశారు. వైయస్ జగన్ ట్విట్టర్ వేదికగా.. ‘మన రాష్ట్రానికి ఉన్న పొడవైన తీరప్రాంతం కేవలం భౌగోళిక సరిహద్దు మాత్రమే కాదు. పోర్టుల ద్వారా జరిగే అభివృద్ధి, తద్వారా మన రాష్ట్రాన్ని మార్చే ఆర్థిక వృద్ధికి ఇంజిన్ లాంటిది అని అన్నారు. ఈ సందర్బంగా వైయస్ఆర్సీపీ పోర్ట్స్ రెవల్యూషన్ హ్యాష్ ట్యాగ్ (#YSRCPPortsRevolution)ను పోస్టులో జత చేశారు.