పశ్చిమగోదావరి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి పోలవరం ప్రాజెక్టుకు చేరుకున్నారు. ముఖ్యమంత్రి హోదాలో మొదటి సారి పోలవరాన్ని సందర్శించిన వైయస్ జగన్ హెలికాప్టర్ నుంచి ఏరియల్ సర్వే నిర్వహించారు. కాసేపట్లో అధికారులు, కాంట్రాక్టర్లతో వైయస్ జగన్ సమీక్ష నిర్వహిస్తారు.