తొలి ఏకాద‌శి శుభాకాంక్షలు తెలిపిన వైయ‌స్‌ జగన్‌

తాడేపల్లి: నేడు తొలి ఏకాద‌శి. ఈ సందర్భంగా వైయ‌స్ఆర్‌సీపీ అధినేత వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్ర ప్ర‌జ‌లంద‌రికీ తొలి ఏకాద‌శి శుభాకాంక్ష‌లు తెలిపారు. 

వైయ‌స్ఆర్‌సీపీ అధినేత వైయ‌స్‌ జగన్‌ ట్విట్టర్‌ వేదికగా..‘రాష్ట్ర ప్ర‌జ‌లంద‌రికీ తొలి ఏకాద‌శి శుభాకాంక్ష‌లు. ఈ ఆషాడ శుద్ధ ఏకాద‌శిని భ‌క్తిశ్ర‌ద్ధ‌ల‌తో జ‌రుపుకోవాల‌ని.. శ్రీ మహావిష్ణువు ఆశీస్సులు మ‌నంద‌రిపై ఉండాలని మ‌న‌స్ఫూర్తిగా కోరుకుంటున్నా’ అంటూ పోస్టు చేశారు. 

Back to Top