ఉత్తరాంధ్రకు పట్టిన దరిద్రం తాగుబోతు అయ్యన్న

ఆంబోతు అయ్యన్న ఎప్పుడూ గంజాయి, మద్యం మత్తులోనే ఉంటాడు

నోరు అదుపులో పెట్టుకోకపోతే.. అయ్య‌న్న‌కు మహిళలే తగిన బుద్ధిచెబుతారు

ఇష్టానుసారంగా నోరుపారేసుకుంటే మహిళలే అనితకు దేహశుద్ధి చేస్తారు

వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత, మాజీ ఎమ్మెల్యే చెంగ‌ల వెంక‌ట్రావు

అరగుండు వెధవ అయ్యన్నపాత్రుడు : ఎస్సీ విభాగం నాయ‌కురాలు రోజారాణి

విశాఖ‌ప‌ట్నం: రాష్ట్రంలో అమలు అవుతున్న సంక్షేమ పథకాలతో ప్రజలంతా సంతోషంగా ఉంటే చూడ‌లేక టీడీపీ నేతలు ఇష్టానుసారంగా ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి, ఎంపీ విజయసాయిరెడ్డి, మంత్రులపై నోర్లు పారేసుకుంటున్నారని వైయ‌స్ఆర్ సీపీ నేత, మాజీ ఎమ్మెల్యే చెంగ‌ల వెంక‌ట్రావు ధ్వ‌జ‌మెత్తారు. ఇదంతా చంద్రబాబు ఒక ప్లాన్ ప్రకారం కుట్ర చేస్తున్నాడని, బాబు ఒక నొటోరియస్‌ క్రిమినల్‌.. అలాంటి వ్యక్తి ప్రతిపక్ష నాయకుడిగా ఉండటం రాష్ట్ర దౌర్బాగ్యమ‌న్నారు. చంద్రబాబు రాష్ట్రంలోని ప్రతి జిల్లాకు ఇద్దరు, ముగ్గురు అచ్చోసిన ఆంబోతులను ముద్రవేసి వదిలివేశాడ‌ని, నర్సీపట్నంలో ఒక తాగుబోతు, గంజాయి బ్రోకర్, ఆంబోతు అయ్యన్న పాత్రుడిని జ‌నం మీద‌కు వ‌దిలాడ‌న్నారు. ఎప్పుడూ మద్యం, గంజాయి మత్తులో ఉండే అయ్య‌న్న నోటికొచ్చిన బూతులన్నీ మాట్లాడుతుంటే వాటిని చూసి చంద్రబాబు శునకానందం పొందుతాడని చంగ‌ల వెంక‌ట్రావు మండిప‌డ్డారు.  విశాఖ‌లోని వైయ‌స్ఆర్ సీపీ కార్యాల‌యంలో పార్టీ నేత‌, మాజీ ఎమ్మెల్యే చెంగ‌ల వెంక‌ట్రావు, పార్టీ ఎస్సీ విభాగం నాయకురాలు రోజారాణి త‌దిత‌ర నేత‌లు విలేక‌రుల స‌మావేశం నిర్వ‌హించారు.

మాజీ ఎమ్మెల్యే చెంగ‌ల వెంక‌ట్రావు ఏం మాట్లాడారంటే..

తాగుబోతు అయ్యన్న ఉత్తరాంధ్రకు పట్టిన దరిద్రం. ప్రజలకు ప్రజా ప్రతినిధులు ఆదర్శంగా ఉండాలి. అయ్యన్న ఇంటి గోడ కూల్చివేత విషయానికి వస్తే.. ఆక్రమించిన స్థలం ఎంతనేది సర్వే జరిగితే కదా, రెండు సెంట్లో, ఇరవై సెంట్లో తెలిసేది. జాయింట్‌ సర్వేకు ఒప్పుకుని మళ్లీ కోర్టు నుంచి ఆర్డర్‌ తెచ్చుకోవడం ఏంటి? మరి, నర్సీపట్నం పిల్లి ఎక్కడ నక్కింది? బయటకు వస్తే తేల్చుకుందాం.

దళితులు, బీసీల గురించి మాట్లాడే అర్హత టీడీపీకి లేదు
ఆక్రమణ నేపథ్యంలో, చట్ట ప్రకారం ఆక్రమణ తొలగిస్తే.. అయ్యన్న పాత్రుడు తన భార్య ద్వారా బీసీ కార్డును తెరమీదకు తేవడం సిగ్గుచేటు. ఎవరు తప్పు చేసినా చట్టం దృష్టిలో అందరూ సమానమే. దళిత కుటుంబంలో పుట్టిన నేను అయినా, ఏదైనా లూటీ చేస్తే మినహాయింపు ఇస్తారా? దళితులు, బీసీలు గురించి మాట్లాడే అర్హత తెలుగుదేశం పార్టీకి లేదు. చంద్రబాబు ఏనాడయినా ఒక దళితుడిని హోంమంత్రిని చేసిన సందర్భాలు ఉన్నాయా? అదే ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్, రాష్ట్రంలో సామాజిక విప్లవం తెస్తూ.. వాలంటీర్ నుంచి కేబినెట్‌ వరకు బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు, మైనార్టీలకు పెద్దపీట వేశారు. హోంమంత్రి పదవులు కూడా ఎస్సీలకు, అందులోనూ మహిళలకు కట్టబెట్టారు.  జగన్‌ మోహన్‌ రెడ్డిగారికి బీసీలంతా మద్దతు ఇస్తున్నారని మీరు బీసీ కార్డు తెరమీదకు తెస్తారా?. సామాజిక న్యాయంపై బహిరంగ చర్చకు మేం సిద్ధం.

నీ కొడుకును ఎంపీని చేయాలి, నువ్వు ఎమ్మెల్యే అయిపోవాలి. దానికి చంద్రబాబు నాయుడు ఒప్పుకోవడం లేదు. నీ కొడుకు ఒక డ్రగ్సిస్ట్‌. ఇక నీ వ్యక్తిగత విషయాల గురించి మాకు అనవసరం. అలాంటి నువ్వు మా ప్రభుత్వంపై విమర్శలా? మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మూడేళ్లలో ఎలాంటి అవినీతి ఆరోపణలు లేకుండా నీతి నిజాయితీగా పరిపాలన చేస్తుంటే ఇష్టానుసారంగా మాట్లాడటం తగదు. గతంలో విశాఖలో మా పార్టీకి చెందిన ఒక వ్యక్తిపై  భూ ఆక్రమణ ఆరోపణలు వస్తే అతడిని పార్టీ నుంచి సస్పెండ్‌ చేసిన పార్టీ వైయస్సార్ సీపీ.

విశాఖలో భూకబ్జాలపై బహిరంగ చర్చకు సిద్ధమా?
గతంలో టీడీపీ హయాంలో మీ మంత్రులు, మీ ఎమ్మెల్యేలు, ఆఖరికి మీ పార్టీ అధ్యక్షుడు ఏరకంగా దోచుకున్నారో అందరికీ తెలిసిందే. దీనిపై సిట్‌ నివేదిక రాగానే చర్యలు తీసుకోవడం జరుగుతుంది. తాగుబోతు అయ్యన్నను ఒకటే అడుగుతున్నాను. సండ్రా హోటల్‌ నీది కాదా? దానికి అక్రమంగా రోడ్డును వేయించుకోలేదా? నీ కొడుకుకు వేరే రాష్ట్రాల్లో అయిదు పవర్‌ ప్లాంట్లు లేవా? కీర్తీ క్రియేషన్స్‌ ఎవరిది? ఆ చౌదరి నీ బినామీ కాదా?  వీటన్నింటిపై చర్చిద్దాం రా..

ఈ వయసులో రేప్ కేసు పెడతారా అంటావు.. మళ్ళీ టెస్ట్ చేసుకోండి అంటావా..!
ఈ వయసులో నాపై అక్రమంగా  రేప్‌ కేసు పెట్టారంటావు. మళ్ళీ మగాడినో కాదో వచ్చి టెస్టు చేసుకోండి అంటావు..  ఒక మహిళను అనవల్సిన మాటేనా అయ్యన్నా ఇది..? ఓవైపు పనికిరానివాడిని అంటూనే మరో వైపు రేప్‌ టెస్ట్‌ చేసుకో అంటావు. నీతో ఇవన్నీ ఎవరు మాట్లాడిస్తున్నారు. ఇప్పటికైనా అసభ్యకర మాటలకు దూరంగా  ఉంటే మంచిది. లేకుంటే మేము అంతకన్నా ఎక్కువే మాట్లాడగలమని హెచ్చరిస్తున్నాం. అడుక్కుతింటున్న నిన్ను ఎన్టీఆర్‌ ఎమ్మెల్యేని చేసి, మంత్రి పదవి ఇచ్చారు. నువ్వు కోట్లు సంపాదించుకున్నావే గానీ ఉత్తరాంధ్రకు చేసిందేమీ లేదు. 

ఒకప్పుడు ఇద్దరం ఒకే పార్టీలో పనిచేశాం. వ్యక్తిగత విషయాలకు వస్తే నీ బాగోతాలు ఎవరికి తెలియవు, వాటన్నింటినీ బయటకు తీస్తే.. నీవు తల ఎక్కడ పెట్టుకుంటావు. అలాంటి నువ్వా మా పార్టీ గురించి విమర్శలు చేసేది. మీ కుటుంబం గంజాయి అమ్ముకుంటుంది.  కాల్ మనీ వ్యాపారాలు చేస్తారు. లేఅవుట్లలో దాదాగిరి చేస్తారు. ప్రభుత్వ భూములు కబ్జాలు చేస్తారు.  అలాంటి నువ్వు నర్సీపట్నం పులివా? పిల్లివా? ఊరకుక్కలా మాట్లాడటం సరికాదు.

ఉత్తరాంధ్ర ద్రోహి
చంద్రబాబు నాయుడు రాజధాని పేరుతో అమరావతిలో 33వేల ఎకరాలు తీసుకుని రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేశాడు. మరి అదే జగన్‌గారు విశాఖను పరిపాలనా రాజధాని చేస్తానంటే చంద్రబాబుతో కలిసి నువ్వు అడ్డుకోలేదా? నువ్వు ఉత్తరాంధ్ర ద్రోహివి. గంజాయి వ్యాపారంతో అయ్యన్నకు సంబంధం ఉంది. గంజాయి వ్యాపారంలో అంతరాష్ట్ర క్రిమినల్‌ బాబా చౌదరిని నువ్వు నారా లోకేష్‌ దగ్గరకు తీసుకువెళ్లి కోట్లాదిరూపాయిలు ముట్ట చెప్పించి, బ్రోకర్‌ పని చేసింది నువ్వు కాదా? ఇప్పటికైనా నీ వైఖరి మార్చుకోకపోతే.. నర్సీపట్నంలో నీ ఇంటికి వచ్చి, నీ నట్టింట్లో మహిళల చేత అవమానాలకు గురి  అవుతావు, జాగ్రత్త. 

అనిత అరాచకాలకు అడ్డే లేదు
ఒక పార్టీకి మహిళా అధ్యక్షురాలు అంటే ఉత్తమ విలువలు ఉన్నవారిని చేయాలి. అప్పుడే ప్రజలకు మంచి జరుగుతుంది. పనికిమాలిన ఆ మహిళ మా ముఖ్యమంత్రిని, వాళ్ల కుటుంబసభ్యులపై ఇష్టానుసారంగా నోరు పారేసుకుంటోంది. నేను కూడా ఒక దళితుడినే,  నీ గురించి మేము మాట్లాడలేమా? నువ్వు చేసిన అవినీతి, దందాలకు గత ఎన్నికల్లో ఎమ్మెల్యే సీటు ఇవ్వలేదు. ప్రభుత్వ భూమినే ప్రభుత్వంతో కొనిపించి రూ.80లక్షలు కొట్టేసింది నిజం కాదా? దాంట్లో నీకు కమిషన్‌ ముట్టింది వాస్తవం అవునా, కాదా? ల్యాండ్ ఎక్విజేషన్‌ జరిగితే నీ బినామీలను అడ్డుపెట్టుకుని ఎన్నికోట్లు దండుకున్నావు అనిత. ఉపాధి హామీ పధకంలో కోట్లాది రూపాయిలు మంజూరు చేయించుకుని ఎన్నికోట్లు మింగేశావు అనిత..? వీటన్నిటిపైనా విచారణ జరిపితే..  జైలుకు వెళ్ళాల్సి ఉంటుంది. 

ముఖ్యమంత్రి మహిళలకు ఎంతో ప్రాధాన్యత ఇస్తారు. దిశ చట్టంపై కూడా అవాకులు చెవాకులా?. ఇష్టానుసారంగా నోరుపారేసుకుంటే మహిళలే అనితకు దేహశుద్ధి చేస్తారని హెచ్చరిస్తున్నాం. 

అరగుండు వెధవ అయ్యన్న: పార్టీ ఎస్సీ విభాగం నాయకురాలు శ్రీమతి రోజా రాణి
గంజాయి వ్యాపారం అంటే అయ్యన్నపాత్రుడు.. అయ్యన్నపాత్రుడు అంటే గంజాయి. టీడీపీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు అనిత, నర్సీపట్నం అరగుండు వెధవ అయ్యన్నపాత్రుడు పిచ్చి ప్రేలాపనలు చేస్తున్నారు. మహిళలను గౌరవం ఇవ్వలేనివాళ్లు వెధవలతో సమానం. గంజాయి, మద్యం తాగి పార్టీ వేదికల మీద నోరు పారేసుకోవడాన్ని ప్రజలు గమనిస్తున్నారన్న సిగ్గూ, శరం కూడా అయ్యన్నపాత్రుడికి లేదు. సుపరిపాలన చేసే వైయ‌స్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి పేరు, విజయసాయి రెడ్డి పేరు ఎత్తే అర్హత కూడా మీకు లేదు. అయ్యన్నా.. ఇప్పటికైనా నీ పద్దతి మార్చుకోకపోతే మహిళలే నీకు తగిన  శాస్తి చేస్తారు.

Back to Top