మీ డ్రీమ్స్ను నా స్కీమ్స్తో నెరవేర్చాను ఉమ్మడి విజయనగరం జిల్లాలో తొమ్మిదికి 9 సీట్లు కానుకగా ఇస్తాంరేపటితో ముగియనున్న ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర వైయస్.జగన్ ను కలిసిన విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట సమిత నాయకులుసోషల్ మీడియా కార్యకర్తల్లో నూతనోత్సాహందాడులకు భయపడేది లేదు విజయనగరం జిల్లాలోకి ప్రవేశించిన సీఎం వైయస్ జగన్ బస్సు యాత్రదాడులకు భయపడేది లేదు బీజేపీ, టీడీపీ, జనసేన కీలక నేతలు వైయస్ఆర్సీపీలో చేరికసీఎం వైయస్ జగన్కు ఉత్తరాంధ్ర సాంప్రదాయ నృత్యాలతో ఘన స్వాగతం
ఎంపీ నందిగం సురేష్పై దాడిని నిరసిస్తూ ర్యాలీ
28 Feb 2020 12:24 PM
విజయవాడ: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దళిత ఎంపీ నందిగం సురేష్పై టీడీపీ గుండాల దాడిని నిరసిస్తూ శుక్రవారం ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ చేపట్టారు. తాళ్లాయపాలెం మీదుగా విజయవాడ వరకు ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా ప్రజా సంఘాల నాయకులు మాట్లాడుతూ..జేఏసీ ముసుగులో ఉన్న టీడీపీ మహిళలు దళిత ఎంపీపై పథకం ప్రకారమే దాడి చేశారని మండిపడ్డారు. ముందుగానే కారం పొట్లాలు వెంట తెచ్చుకొని బస్సులో వచ్చి ఎంపీ కాన్వయ్పై చల్లారని, ఈ దాడులను ఖండిస్తున్నామన్నారు. చంద్రబాబు ఓ పథకం ప్రకారమే రాష్ట్రంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించేందుకు ప్రయత్నం చేస్తున్నారని, ఆ నేపథ్యంలోనే ఈ దాడి జరిగిందని, ప్రతి ఒక్కరు ఈ దాడిని ఖండించాలని కోరారు. దాడిలో చంద్రబాబు పాత్ర ఉందన్నారు. చంద్రబాబు రాజధానిలో అడుగుపెట్టాలంటే దళితులతో పాటు నందిగం సురేష్కు క్షమాపణ చెప్పాలని డిమాండు చేశారు.