వైయస్ఆర్ సీపీలో చేరిన ఎచ్చర్ల టీడీపీ కీలక నేతలువైయస్ఆర్ సీపీలో చేరిన టీడీపీ సీనియర్ నేతవైయస్ఆర్ సీపీలో చేరిన లోలుగు లక్ష్మణరావువైయస్ఆర్ సీపీలో చేరిన మాజీ ఎమ్మెల్యే కొర్ల భారతి22వ రోజు `మేమంతా సిద్ధం` బస్సు యాత్ర ప్రారంభంరేపు సీఎం వైయస్ జగన్ నామినేషన్మీ డ్రీమ్స్ను నా స్కీమ్స్తో నెరవేర్చాను ఉమ్మడి విజయనగరం జిల్లాలో తొమ్మిదికి 9 సీట్లు కానుకగా ఇస్తాంరేపటితో ముగియనున్న ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర వైయస్.జగన్ ను కలిసిన విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట సమిత నాయకులు
దిశ చట్టం మహిళల్లో ఆత్మస్థైర్యం నింపింది
18 Feb 2020 5:34 PM
రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ
విశాఖపట్నం: దిశ చట్టం మహిళల్లో ఆత్మస్థైర్యం నింపిందని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ అన్నారు. ఆంధ్ర యూనివర్సిటీ పరిధిలో నిర్వహిస్తున్న ఉమెన్స్ స్టడీ సెంటర్ల విద్యార్థులతో జరిగిన ముఖాముఖి కార్యక్రమానికి వాసిరెడ్డి పద్మ, పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వాసిరెడ్డి పద్మ మాట్లాడుతూ.. మహిళల భద్రతపై దేశానికి మార్గం చూపించేలా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దిశ చట్టాన్ని తీసుకువచ్చిందన్నారు. మహిళలపై నేరాలు పాల్పడిన క్రూర మృగాలు ఏళ్ల తరబడి శిక్షలను తప్పించుకుంటూ చట్టాలకే సవాళ్లు విసిరే పరిస్థితి ఉందన్నారు. అలాంటి పరిస్థితులను రూపుమాపి 21 రోజుల్లో శిక్ష పడే విధంగా దిశ చట్టాన్ని తయారు చేసి దాని అమలు కోసం కృషి చేస్తున్న సీఎం వైయస్ జగన్ను మహిళా లోకం కృతజ్ఞతలు తెలుపుతుంది.