ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డిపై టీడీపీ నేతల రాళ్ల దాడి.. 

 శ్రీ సత్యసాయి:  వైయ‌స్ఆర్‌సీపీ ఎమ్మెల్యే  దుద్దుకుంట శ్రీధర్ రెడ్డిపై టీడీపీ నేతలు రాళ్ల‌తో దాడికి దిగారు. టీడీపీ నేతల దౌర్జన్యంతో పుట్టపర్తి నియోజకవర్గంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్‌ చేస్తున్న ఆరోపణలపై స్థానిక ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి బహిరంగ చర్చకు సిద్ధం అయ్యారు. ఈ క్రమంలో సత్యమ్మ ఆలయం వద్దకు శ్రీధర్ రెడ్డి చేరుకోగా.. టీడీపీ నేతలు రాళ్లు రువ్వారు. 
టీడీపీ నేత‌, మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి ఏకంగా శ్రీధర్ రెడ్డి పైకి దూసుకొచ్చారు. అక్కడితో ఆగకుండా కారుపైకి ఎక్కి టీడీపీ కార్యకర్తలను రెచ్చగొట్టారు పల్లె. ఈ క్రమంలో అక్కడ ఉన్న టీడీపీ నేతలు.. వైయ‌స్ఆర్‌సీపీ నేతల వాహనాలను ధ్వంసం చేశారు. పరిస్థితి అదుపు తప్పేలా కనిపించడంతో పోలీసులు లాఠీ ఛార్జి చేశారు.

Back to Top