వైయ‌స్ఆర్ సీపీలో చేరిన గంటా న‌ర‌హ‌రి

తాడేప‌ల్లి: రాజంపేట పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గ టీడీపీ ఇన్‌చార్జ్ గంటా నరహరి వైయ‌స్ఆర్ సీపీలో చేరారు. తాడేప‌ల్లిలోని సీఎం క్యాంపు కార్యాల‌యంలో వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షులు, ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి స‌మ‌క్షంలో గంటా న‌ర‌హ‌రి వైయ‌స్ఆర్ సీపీ కండువా క‌ప్పుకున్నారు. ఈ కార్యక్రమంలో  వైయ‌స్‌ఆర్ సీపీ రీజనల్‌ కోఆర్డినేటర్‌, ఎంపీ పి.వి.మిథున్‌రెడ్డి, ఒంగోలు పార్లమెంట్ వైయ‌స్‌ఆర్ సీపీ ఎంపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్‌ రెడ్డి పాల్గొన్నారు. 

Back to Top