ఉద్యోగులతో సంప్రదింపులకు ప్ర‌త్యేక కమిటీ ఏర్పాటు

అమ‌రావ‌తి:  పీఆర్‌సీపై ఉద్యోగుల‌తో సంప్ర‌దింపులు జ‌రిపేందుకు ప్ర‌భుత్వం ప్ర‌త్యేక క‌మిటీ ఏర్పాటు చేసింది. మంత్రులు, సీఎస్ తో కూడిన కమిటీ ఏర్పాటు చేసిన ప్రభుత్వం.  మంత్రులు బుగ్గన, పేర్ని నాని, బొత్స, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామ‌కృష్ణారెడ్డి, సీఎస్ తో కూడిన కమిటీ ఏర్పాటు చేశారు. ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో శుక్రవారం ఉదయం ప్రారంభమైన రాష్ట్ర మంత్రివర్గం సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకున్నట్టు అధికార వర్గాల ద్వారా తెలిసింది. 

Back to Top