సామాజిక సాధికారత ..ఒకనాటి కల – నేడు నిజం

అణగారిన వర్గాలపై జగనన్నకు అంతులేని ప్రేమ: నారాయణస్వామి, డిప్యూటీ సీఎం

ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు పెద్దపీట: అంజాద్‌బాషా, డిప్యూటీ సీఎం

నాలుగున్నరేళ్ల పాలన.. ఓ సామాజిక విప్లవం:  బీద మస్తాన్‌ రావు, ఎంపీ

చిత్తూరులో సామాజిక సాధికార యాత్ర

 వెల్లువెత్తిన ప్రజాభిమానం 

చిత్తూరు: సామాజిక సాధికార యాత్రకు చిత్తూరు నియోజకవర్గం జేజేలు కొట్టింది. వేలాదిగా తరలివచ్చిన జనంతో... సభాస్థలి జనసంద్రాన్ని తలపించింది. ముఖ్యంగా భారీ సంఖ్యలో మహిళలు స్వచ్ఛందంగా ఈ కార్యక్రమానికి తరలివచ్చారు. నాలుగున్నరేళ్ల సీఎం వైయస్‌ జగన్‌ పాలనలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు జరిగిన మంచిని వివరించారు నాయకులు.

 

అంజాద్‌బాషా, డిప్యూటీ సీఎం.

 

– వైయస్సార్‌ కాంగ్రెస్‌ పాలనలో.. అసలు సిసలు సామాజిక సాధికారత కనిపిస్తోంది. సామాజిక న్యాయం జరుగుతోంది. 

– అణగారిన వర్గాలను ఓటు బ్యాంకుగానే చూసిన రోజులకు కాలం చెల్లి... బ్యాక్‌బోన్‌ బలం మీరేనంటున్న జగనన్న పాలన వచ్చింది.

– మైనార్టీనైన నాకు ఉపముఖ్యమంత్రి పదవినివ్వడం నాకే కాదు.. మైనార్టీలకు సంబంధించి కూడా ఓ గొప్ప చారిత్రక సందర్భం అని పేర్కొన్నారు.

 

నారాయణస్వామి, డిప్యూటీ సీఎం

 

– ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల సామాజిక సాధికార యాత్ర.. ఓ చారిత్రక సందర్భంలో సాగుతున్న జైత్రయాత్ర. 

– బడుగు బలహీన వర్గాల ప్రజలకు, ఈ నాలుగున్నరేళ్లలో జగన్‌ ప్రభుత్వం చేసిన మేలు అంతా ఇంతా కాదు. 

– దేశంలో ఏ ముఖ్యమంత్రి ఇంతగా చెయ్యలేదు. మన సంక్షేమ పథకాలు దేశవ్యాప్తంగా చర్చగా మారాయి.

– చంద్రబాబు హయాంలో బీసీలకు ఎప్పుడూ అన్యాయమే జరిగింది. బాబు నాడు అన్నీ అబద్ధాలే చెప్పి మోసం చేశారు. 

– ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు అధికార పదవుల్లోనూ వాటా ఇచ్చి ప్రోత్సహిస్తున్న ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, 

– ఆయా వర్గాల మధ్య చీలికలు తెచ్చి, తన రాజకీయ పబ్బం గడుపుకొన్న చంద్రబాబు చేసినవన్నీ కుట్రపూరిత రాజకీయాలే. 

– వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చాక 90 శాతం పదవులు, పథకాలు, బడుగు, బలహీనవర్గాలకే కేటాయించారు. 

–ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు పదవులు, సంక్షేమ పథకాల్లో పెద్దపీట వేసింది జగన్‌ ప్రభుత్వమే. 

– 8మంది బీసీలను రాజ్యసభకు పంపిన ఘనత జగన్‌మోహన్‌రెడ్డిదే. 23మంది బీసీలకు ఎమ్మెల్సీ పదవులను ఇచ్చిందీ ఆయనే. 

–బాబాసాహెబ్‌ అంబేద్కర్, ఫూలే ఆశయాలను అమలు చేస్తున్న ముఖ్యమంత్రి మన జగనన్న. 

– మన మంచి భవిష్యత్తు కోసం.. మనం జగనన్నను మళ్లీమళ్లీ గెలిపించుకోవాలి.

 

బీద మస్తాన్‌రావు, పార్లమెంట్‌ సభ్యులు

– గతంలో ఎన్నడూ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు అన్ని రంగాల్లో పెద్దపీట వేసిన పరిస్థితి లేదు. 

– జగనన్న ప్రభుత్వంలో పరిస్థితి మారింది. ఈ వర్గాలకు పిలిచి మరీ సీట్లు ఇచ్చిన చరిత్ర వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీది.

– దళిత వర్గాలు ఈ రోజు ఆర్థికంగా, సామాజికంగా ముందంజ వేశాయన్నా, వేస్తున్నాయన్నా.. నాడు వైయస్సార్, నేడు వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డిల చలవే. – తండ్రిని మించిన తనయుడిలా జగన్‌ పాలన సాగిస్తున్నారు. 

– బడుగు బలహీనవర్గాల పిల్లలు చదువుల్లో ముందుండాలని మనసారా కోరుకుంటూ, వినూత్న పథకాలు తెచ్చిన ఘనత జగనన్నదే. 

– నిజమైన సామాజిక న్యాయాన్ని ఇప్పుడే చూస్తున్నాం.

Back to Top