ప్రజాకవి శ్రీశ్రీకి వైయ‌స్‌ జగన్‌ నివాళి 

తాడేప‌ల్లి: మహాకవి శ్రీరంగం శ్రీనివాసరావు జయంతి  సందర్భంగా  వైయ‌స్ఆర్‌సీపీ  అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌ మోహన్‌రెడ్డి నివాళుల‌ర్పించారు. ఈ  మేర‌కు త‌న ఎక్స్ ఖాతాలో ఓ పోస్ట్‌ చేశారు.  
 
అణగారిన వర్గాల వేదనను అక్షర రూపంలో జ్వాలగా మలిచి విప్లవానికి నాంది పలికిన మహాకవి శ్రీరంగం శ్రీనివాసరావు (శ్రీశ్రీ) గారు. ``నేను సైతం.. నేను సైతం ప్రపంచాగ్నికి సమిధనొక్కటి ఆహుతిచ్చాను`` అంటూ సామాన్యుల్లోనూ అభ్యుదయ భావాన్ని నింపిన అక్షర శిల్పి శ్రీశ్రీ.. 

నిద్రావ‌స్థ‌లో ఉన్న‌ సమాజాన్ని ‘మహాప్రస్థానం’తో తట్టి లేపి, చైతన్యాన్ని తీసుకువచ్చిన ప్రజాకవి జయంతి సందర్భంగా నివాళులర్పిస్తున్నాను అంటూ ఎక్స్‌ ఖాతాలో వైయ‌స్‌ జగన్ ట్వీట్‌ చేశారు. 

Back to Top